REVANTH REDDY TWEET: 'ట్విటర్‌ పిట్ట ఇచ్చిన హామీకి ఇప్పటికీ అతీగతీ లేదు'

author img

By

Published : Jun 16, 2022, 3:35 PM IST

రేవంత్‌రెడ్డి

REVANTH REDDY TWEET: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్‌ పిట్ట ఇచ్చిన హామీకి ఇప్పటికీ అతీగతీ లేదని ఆయన కేటీఆర్​పై వ్యంగాస్త్రాలు సంధించారు.

REVANTH REDDY TWEET: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. సమస్యల పరిష్కరించమని విద్యార్ధులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఆందోళన చేస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ట్విటర్‌ పిట్ట ఇచ్చిన హామీకి ఇప్పటికీ అతీగతీ లేదని ఆయన కేటీఆర్​ను ఉద్దేశించి పరోక్షంగా ఎద్దేవా చేశారు. తెరాసకు విద్యార్ధులు, యువతే బుద్ది చెబుతారని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

  • ఎండకు ఎండుతు, వానకు తడుస్తు బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.
    ట్విట్టర్ పిట్ట ఇచ్చిన హామీకి అతీగతీ లేదు. ఇంత తోలుమందం ప్రభుత్వాన్ని చరిత్రలో చూడలేదు.
    టీఆర్ఎస్ తోలు వలిచేది ఈ విద్యార్థులు, యువతే!#RGUKTIAN#IIITBasar pic.twitter.com/KBdyFPqUVM

    — Revanth Reddy (@revanth_anumula) June 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Will take all the issues mentioned to the notice of Hon’ble CM KCR Garu & Education Minister @SabithaindraTRS Garu

    Kindly be assured that we are committed to resolving any challenges with respect to improving quality of education https://t.co/jNLkemAkMU

    — KTR (@KTRTRS) June 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అసలేం జరిగిదంటే: బాసరలోని ఆర్జీయూకేటీ విద్యార్థుల ఆందోళనపై తేజగౌడ్‌ అనే వ్యక్తి చేసిన ట్వీట్​కు బుధవారం మంత్రి కేటీఆర్ స్పందించారు. విశ్వవిద్యాలయంలో మౌలిక వసతులపై 8 వేల మంది విద్యార్థులు రోడ్డెక్కారంటూ... ఆ ట్వీట్​లో పేర్కొన్నాడు. దీనిపై కేటీఆర్‌ వెంటనే స్పందించి సమస్య పరిష్కరిస్తామని ట్విటర్ వేదికగా తెలిపారు. కేటీఆర్​ చేసిన రీట్వీట్​కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా సమాధానం ఇచ్చారు. సంబంధిత వైస్‌ ఛాన్స్‌లర్‌తో నిన్న సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు. అయినా ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదని రేవంత్ ఆరోపించారు.

బాసర ట్రిపుల్ ఐటీలో డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ... మూడ్రోజులుగా వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా విద్యార్థులు నిరనసలు తెలుపుతున్నారు. గొడుగులు పట్టుకుని తమ సమస్యల కోసం పోరాడుతున్నారు. విద్యార్థులు చెబుతున్న ప్రధానమైన 12 సమస్యలను పరిష్కరించాలంటూ... ఆందోళన తెలుపుతున్నారు. విద్యార్థులకు మద్దతుగా వచ్చిన కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సమస్యల పరిష్కారం కోరుతూ... మూడ్రోజులుగా విద్యార్థులు ఆందోళన తెలుపుతున్నారు. మరోవైపు ఆందోళన తెలుపవద్దంటూ పలువురు బెదిరిస్తున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి: 'డైరెక్టర్​తో సమస్యలు పరిష్కారం కావు.. కేసీఆర్ రావాల్సిందే'

130ఏళ్ల చెట్టుపై 'మెర్క్యూరీ' దాడి.. నలుగురు డాక్టర్ల స్పెషల్ ట్రీట్​మెంట్​తో...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.