KTR America Tour Updates : కేటీఆర్ అమెరికా పర్యటనతో.. రాష్ట్రానికి పెట్టుబడుల వర్షం
Published: May 20, 2023, 12:30 PM


KTR America Tour Updates : కేటీఆర్ అమెరికా పర్యటనతో.. రాష్ట్రానికి పెట్టుబడుల వర్షం
Published: May 20, 2023, 12:30 PM
Zynysys biologics Invests in Hyderabad : పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సాగుతున్న మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన విజయవంతంగా సాగుతోంది. వివిధ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఐటీ, ఫార్మా, డిఫెన్స్ సహా వివిధ రంగాల కంపెనీల ప్రతినిధులను కలిసి తెలంగాణలోని పారిశ్రామిక, వ్యాపార అవకాశాలు, ప్రభుత్వ విధానాలను మంత్రి కేటీఆర్ వారికి వివరిస్తున్నారు.
Zynysys biologics Invests in Hyderabad : తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా అమెరికాలో మంత్రి కేటీఆర్ పర్యటన సాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వచ్చిన విషయం తలిసిందే. తాజాగా మధుమేహుల కోసం ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ‘జెనిసిస్ బయాలజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ హైదరాబాద్లో తమ కంపెనీ విస్తరణకు అంగీకారం తెలిపింది. జీనోమ్ వ్యాలీలో మరో 50 నుంచి 60 మిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడితో ‘రీ కాంబినెంట్ బల్క్ మాన్యుఫాక్చరింగ్’ కేంద్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Technip FMC Company invests in Hyderabad : రాష్ట్రంలో 1,250 కోట్ల పెట్టుబడికి ఫ్రెంచ్ అమెరికన్ ఆయిల్ అండ్ గ్యాస్ దిగ్గజ కంపెనీ.. టెక్నిప్ ఎఫ్ఎంసీ సుముఖత వ్యక్తం చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తమ సాఫ్ట్వేర్ గ్లోబల్ డెలివరీ సెంటర్, ప్రెసిషన్ ఇంజినీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి హైదరాబాద్ను కీలక కేంద్రంగా ఎంచుకుంటున్నట్లు సంస్థ ప్రకటించినట్లు తెలిపారు. రూ5,400 కోట్ల ఎగుమతి విలువతో.. 1,250 కోట్లను సంస్థ పెట్టుబడిగా పెట్టడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సంస్థ రాకతో సుమారుగా 4వేల మందికి ఉపాధి కల్పన జరుగుతుందని చెప్పారు.
Jap Com Invests in Telangana : రాష్ట్రంలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఏర్పాటు చేయనున్నట్లు ‘జాప్ కామ్ గ్రూప్’ తెలిపింది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఉత్పత్తుల తయారీలో పేరొందిన ఈ సంస్థ భాగ్యనగరంలో తన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. కరీంనగర్లో ఇప్పటికే సేవలందిస్తున్న మెడికల్ కోడింగ్ సెంటర్ను విస్తరించేందుకు ‘3ఎం' హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సంస్థ ఆసక్తి కనబరుస్తోంది.
KTR America Tour Updates : అమెరికా రాజధానిలో మంత్రి కేటీఆర్ 30కి పైగా ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణలోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ఫలితంగా రాష్ట్రానికి 2500 ఐటీ ఉద్యోగాలు రాబోతున్నాయని మంత్రి తెలిపారు. హైదరాబాద్లో కొనసాగుతున్న కార్యక్రమాలు, కార్యాచరణపై చర్చించారు. న్యూయార్క్లో భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్తో సమావేశమైన కేటీఆర్.. భవిష్యత్ వ్యాపార అవకాశాలు, ఇన్నోవేషన్ వంటి రంగాల్లో సహకారంపై చర్చించారు.
ఇవీ చదవండి:
