MMTS: ఎంఎంటీఎస్​ సర్వీసులు పెంచిన దక్షిణ మధ్య రైల్వే

author img

By

Published : Jun 28, 2021, 9:29 PM IST

Increased MMTS train services

రాష్ట్రవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుతున్న క్రమంలో హైదరాబాద్ వాసులకు దక్షిణ మధ్యరైల్వే మరో శుభవార్త చెపింది. కొన్ని రోజుల క్రితమే 10 ఎంఎంటీఎస్​ రైలు సర్వీసులను ప్రారంభించిన రైల్వే శాఖ తాజాగా జులై 1 నుంచి మరో 45 రైలు సర్వీసులను అదనంగా నడపనున్నట్లు ప్రకటించింది.

కొవిడ్ మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గుతుండడంతో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం 10 ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే శాఖ తాజాగా జులై 1 నుంచి వాటికి అదనంగా మరో 45 సర్వీసులను పెంచడానికి ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు బోర్డు అనుమతి మంజూరు చేసిందని అధికారులు వెల్లడించారు.

జులై 1నుంచి అదనంగా నడపనున్న 45 ఎంఎంటీఎస్​ రైళ్లలో ఫలక్​నుమా- లింగంపల్లి- రామచంద్రాపురం మార్గంలో 13, లింగంపల్లి- రామచంద్రాపురం-ఫలక్​నుమా మార్గంలో 12, హైదరాబాద్- లింగపల్లి రూట్​లో 10, లింగంపల్లి- హైదరాబాద్​ మార్గంలో 10 చొప్పున​ సర్వీసులను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందు ఎదురుకాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఈ రైళ్లను ఏ సమయం నుంచి ఏ సమయం వరకు నడపనున్నారు అనే విషయంపై స్పష్టత రావాల్సిఉంది.

ఇదీ చదవండి: ktr on link roads: 'ట్రాఫిక్​ సమస్యలు, ప్రయాణ దూరం తగ్గించడమే లక్ష్యంగా లింకురోడ్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.