Seed Festival in Hyderabad : 'పండిన పంటే విత్తనం.. అలా చేస్తేనే నాసిరకం విత్తనాన్ని అడ్డుకోగలం'

author img

By

Published : May 25, 2023, 9:54 AM IST

Updated : May 25, 2023, 2:21 PM IST

Seed Festival

Seed Festival At Professor Jayashankar University : ఈ ఏడాది వానాకాలం సన్నాహాలు మొదలయ్యాయి. రోహిణె కార్తె ప్రారంభం కానుండటంతో... రైతులు విత్తనాల సమీకరణలో నిమగ్నమయ్యారు. ఏటా సంప్రదాయం ప్రకారం ఈ సారి కూడా సీజన్‌ ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నాణ్యమైన విత్తన పంపిణీ మొదలుపెట్టింది. ప్రభుత్వ రంగ, ఐసీఏఆర్ పరిశోధన సంస్థలతో కలిసి వర్సిటీ ఆధ్వర్యంలో విత్తన మేళా -2023 ఘనంగా సాగుతోంది. ఈ మేళాను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.

Seed Festival At Professor Jayashankar University : ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో భూములు చదును చేసుకోవడం, విత్తన సేకరణలో రైతులు నిమగ్నమయ్యారు. నాణ్యమైన విత్తనాలు రైతులకు సరఫరా చేసేందుకు సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం ప్రాంగణంలో విత్తన మేళా -2023 ప్రశాంతంగా సాగుతోంది. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపొందించిన 59 రకాల వండగాల బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించారు

రాజేంద్రనగర్‌లో ప్రధాన ఆహార పంట వరి విత్తనాలు 635 క్వింటాళ్లు పైగా అందుబాటులో పెట్టారు. రైతులు పండిచిన పంటనే విత్తనాలుగా వాడుకోవడం ద్వారా నకిలీ విత్తనాలను అరికట్టవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ విధానం ద్వారా రైతులకు అధిక ఖర్చు తగ్గడంతో పాటు నాణ్యమైన పంట దిగుబడి వస్తుందని ఆకాంక్షిస్తున్నారు. ప్రైవేటు కంపెనీలపై ఆధారపడటం, నాసిరకం విత్తనాలతో విసిగిపోయి రైతులు నాణ్యమైన వంగడాల కోసం రాజేంద్రనగర్ వచ్చి కొనుగోలు చేసి తీసుకెళుతుండటం విశేషం.

'రైతులు అడిగే సన్న విత్తనాలు అందుబాటులోకి తెచ్చాం. కేఎన్ఎంహెచ్ , కందితో పాటు ఇతర విత్తనాలు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చాం'. - డాక్టర్ ఎన్.రాంగోపాల్‌వర్మ, ప్రధాన శాస్త్రవేత్త.

Seed Festival At Professor Jayashanker University : వరంగల్‌, జగిత్యాల జిల్లాల్లో విత్తన మేళా ఘనంగా జరిగింది. కార్యక్రమంలో విత్తనాలను ప్రదర్శనగా ఉంచారు. సీడ్ మేళాకు రైతుల నుంచి అపూర్వ స్పందన లభించింది. వచ్చే పంటకాలం సాగు విధానంపై శాస్త్రవేత్తలు రైతులకి అవగాహన కల్పించారు. వర్సిటీసహా ప్రభుత్వ రంగ, ఐసీఏఆర్ అనుబంధ జాతీయ సంస్థల ఆధ్వర్యంలో వరి, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, మినుము, వేరుశనగ, నువ్వులు, సోయాచిక్కుడు, ఆముదం, పత్తి, సజ్జ, అలసంద అందుబాటులో పెట్టి అందరికి విక్రయిస్తున్నారు.

'వడగల్ల వాన పడి రైతులు చాలా నష్టపోయారు. అలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా ముందు నుంచే రైతులతో పంట వేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. అలాగే భవిష్యత్తులో కరెంటు, నీరు ఎక్కువ వాడకుండా పంటలు ఎలా పండించాలో వారికి వివరిస్తున్నాం.' - ఉమారెడ్డి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం సహ సంచాలకులు.

ఈ విత్తన మేళాకు రైతుల నుంచి అనూహ్య స్పందన లభించింది. నిన్న లాంఛనంగా ప్రారంభించినప్పటికీ... సమకూర్చిన నిల్వలన్నీ అయిపోయే వరకు ఈ మేళా సాగుతుంది. సొంత వాహనాలు, రవాణా సదుపాయాల్లేని రైతుల సౌకర్యార్థం ఆర్టీసీ కార్గో సేవలు అందుబాటులోకి వచ్చాయి.

ఇవీ చదవండి:

Last Updated :May 25, 2023, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.