Vande Bharat : సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్​.. సమయాల్లో స్వల్ప మార్పులు

author img

By

Published : May 15, 2023, 12:17 PM IST

Vande Bharath

Secunderabad to Tirupati Vande Bharath Timings Change :సికింద్రాబాద్​-తిరుపతికి మధ్య నడుస్తున్న వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ ట్రైన్​ సమయాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై 15 నిమిషాలు ఈ రైలు ఆలస్యంగా నడవనుంది. ఉదయం 6 గంటలకు బయలుదేరే ట్రైన్​ 6.15 నిమిషాలకు బయలుదేరనుంది. రైలు రాకపోకల మార్పులకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి ట్విటర్​​లో తెలిపారు.

Secunderabad to Tirupati Vande Bharath Timings Change : సికింద్రాబాద్​-తిరుపతి మధ్య నడుస్తున్న వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ రైలుకు సంబంధించి కీలక విషయాన్ని ప్రకటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎనిమిది కోచ్​లతో నడుస్తున్న ఈ రైలు బోగీల సామర్థ్యాన్ని ఇటీవలే రెట్టింపు చేసిన రైల్వే బోర్డు తాజాగా మరో మార్పు తీసుకువచ్చింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ మార్పు తీసుకువచ్చినట్లు కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇంతకీ వందే భారత్​ రైలు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే..?

Secunderabad to Tirupati Vande Bharath Train : సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వేళల్లో స్వల్పమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరే వందేభారత్ ఎక్స్ ప్రెస్ సమయాన్ని ఈ నెల 17 నుంచి ఉదయం 6:15 గంటలకు మారుస్తున్నారు. తిరుపతి నుంచి వచ్చే రైలు మధ్యాహ్నం 3:15 గంటలకు బయలుదేరి రాత్రి 11:30 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.

Secunderabad to Tirupati Vande Bharath Train Timings : రెండు వైపులా 8 గంటల 15 నిమిషాల్లో గమ్య స్థానాలను చేరుకునేలా వేళల్ని ఖరారు చేశారు. అయితే మార్పుచేసిన వేళల్ని ఐఆర్సీసీటీసీ తన అధికారిక వెబ్ సైట్‌లో అప్ డేట్ చేయలేదు. డిమాండ్ దృష్ట్యా బోగీల సంఖ్యను 16కు పెంచేందుకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. పెంచిన బోగీలను కూడా ఈనెల 17 నుంచి అమలు చేసేందుకు యోచిస్తోంది. ఈ మేరకు సీట్ల సంఖ్య 530 నుంచి 1,036కు పెరగనుంది.

Secunderabad to Tirupati Vande Bharath Train New Timings : వందేభారత్​ రైళ్లకు మంచి స్పందన రావడంతో రైల్వేశాఖ ఈ రైళ్లను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఈ రైళ్లు దేశంలోని పలు నగరాల్లో 15 రూట్లల్లో నడుస్తోంది. కాగా మరో 5 రూట్లలో ఈ రైలు నడిపేందుకు ఆలోచిస్తున్నట్టు సమాచారం.

మొదటగా పూరీ-హావ్​డా రూట్​లో నడిపేందుకు ఈ నెలలోనే తీసుకురాడానికి కేంద్ర రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ రహదారిలో ట్రయల్​ రన్​ విజయవంతం అయినందుకు ఒడిశా ప్రభుత్వం భువనేశ్వర్​ నుంచి హైదరాబాద్​కు, పూరీ నుంచి రాయ్​పూర్​ రూట్లలో ఇంకొన్ని రైళ్లు తెవాలని కేంద్రానికి కోరినట్టు తెలుస్తోంది. వందే భారత్ రైళ్లతో తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయాణం కాస్త సులువైనట్లు కనిపిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.