తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (tsrtc) ఛైర్మన్గా నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్దన్ (mla bajireddy govardan) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్డు వద్ద గల బస్భవన్ (bus bhavan)లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి (minister prashanth reddy), ఎమ్మెల్సీ కవిత (mlc kavitha) హాజరయ్యారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ఆర్టీసీకి బాజిరెడ్డి గోవర్దన్ రెండో ఛైర్మన్.
ఆర్టీసీని నష్టాల బాట నుంచి గట్టెక్కించేందుకు దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తిస్థాయి ఎండీని నియమించింది. తాజాగా సంస్థ ఛైర్మన్గా సీనియర్ శాసనసభ్యుడు బాజిరెడ్డికి పగ్గాలు అప్పగించింది.
గతంలోనే ఉత్తర్వులు..
బాజిరెడ్డిని ఆర్టీసీ ఛైర్మన్గా నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్(CM Kcr) గతంలోనే ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే(nizamabad (rural) assembly constituency)గా ఉన్నారు. కేబినెట్ విస్తరణ సమయంలో బాజిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని భావించినా.. అనివార్య కారణాల వల్ల ఆయనకు అమాత్య పదవి దక్కలేదు. అయితే.. ఆయనకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తానని అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని సమాచారం.ఇందులో భాగంగా రైతు సమన్వయ సమితి ఛైర్మన్గా ముందుగా బాజిరెడ్డి గోవర్దన్ను నియమిస్తారని చర్చ జరిగినా.. చివరకు ఆ పదవి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డికి దక్కింది. రెండో సారి కూడా భంగపడ్డ గోవర్దన్కు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద పదవే కట్టబెట్టారు. టీఎస్ ఆర్టీసీకి ఛైర్మన్గా నియమిస్తూ బాధ్యతలు అప్పజెప్పారు.
ఇదీ చూడండి: White Challenge: ఎలాంటి పరీక్షలకైనా సిద్ధంగా ఉన్నా: మంత్రి కేటీఆర్