సీఎం కేసీఆర్‌తో మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి సమావేశం

author img

By

Published : Nov 25, 2022, 12:38 PM IST

Updated : Nov 25, 2022, 1:05 PM IST

kcr

12:36 November 25

సీఎం కేసీఆర్‌తో మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి సమావేశం

Ministers meeting with CM Kcr: సీఎం కేసీఆర్‌తో మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి సమావేశమయ్యారు. శాసనసభ సమావేశాల నిర్వహణపై పలు కీలక అంశాలపై చర్చ జరుపుతున్నారు. డిసెంబరులో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రంపై ఆర్థిక ఆంక్షలు, కేంద్ర ఆర్థిక విధానాలపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించనున్నారు.

Telangana Assembly sessions: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కేంద్రం విధిస్తున్న ఆంక్షలపై చర్చించేందుకు శాసనసభను సమావేశపరచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. డిసెంబర్‌లో వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి... అందుకు చర్యలు తీసుకోవాలని మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డిని ఆదేశించారు. తెలంగాణపై కేంద్రం విధిస్తున్న అనవసర ఆంక్షలతో... ఈ ఆర్థికఏడాదిలో రాష్ట్రానికి సమకూరాల్సిన ఆదాయంలో 40వేల కోట్లు తగ్గుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఈ చర్యలతో తెలంగాణ అభివృద్ధి ముందుకు సాగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తోందని ఆరోపిస్తోంది.

అన్ని విషయాలను రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలిపేందుకు వీలుగా... శాసనసభ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సెప్టెంబర్‌లో సమావేశమైన ఉభయసభలు ఇప్పటి వరకు ప్రోరోగ్ కాలేదు. దీంతో గత సమావేశాలకు కొనసాగింపుగానే తాజా సమావేశాలు కూడా జరగనుండటంతో... ఈసారి గవర్నర్ ప్రసంగం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా... సభాపతి, మండలి ఛైర్మన్ల ఆదేశాలతో... సమావేశాల నిర్వహణపై శాసనసభ సచివాలయం సభ్యులకు సమాచారం అందించనుంది.

ఇవీ చదవండి:

Last Updated :Nov 25, 2022, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.