ఎన్ని లక్షల మంది రైతుల ఆదాయం రెట్టింపయ్యిందో చెప్పాలి: కేటీఆర్

author img

By

Published : Jul 16, 2022, 4:55 PM IST

కేటీఆర్

Ktr On Central: రైతుల ఆదాయం రెట్టింపైందన్న కేంద్ర వ్యవసాయ శాఖ అధికారిక ట్వీట్​కు మంత్రి కేటీఆర్​ కౌంటర్ ఇచ్చారు. కేంద్రం చెప్పింది నిజమైతే వివరాలను ప్రజల ముందు పెట్టాలని ట్వీట్టర్ ద్వారా ప్రశ్నించారు. సాగు, రైతుల కోసం ఏ పథకాలను అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

  • If the claim 👇of the Agriculture Dept is true, I request the Hon’ble @PMOIndia to furnish the details to the people of this country

    1) How many millions of farmers doubled their Income?
    2) Which state are these farmers from?
    3) Which initiative of Govt was key to achieve this? https://t.co/5mTGmJtw3D

    — KTR (@KTRTRS) July 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Ktr On Central: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రధాని మోదీ లక్ష్యానికి అనుగుణంగా దేశంలోని ఎంతో మంది రైతుల ఆదాయం రెట్టింపైందని కేంద్ర వ్యవసాయ శాఖ తన అధికారిక ట్విటర్​లో పోస్ట్ పెట్టింది. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది నిజమైతే అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను దేశ ప్రజల ముందు పెట్టాలని ప్రధానిని కేటీఆర్ డిమాండ్ చేశారు.

మోదీ అధికారంలోకి వచ్చాక దేశ వ్యవసాయ రంగాభివృద్ది, రైతుల సంక్షేమం కోసం ఏ పథకాలు అమలు చేశారో చెప్పాలని కేటీఆర్​ డిమాండ్ చేశారు. ఎన్ని లక్షల మంది రైతుల ఆదాయం రెట్టింపైందో వివరాలను బహిర్గతం చేయాలని మంత్రి కోరారు. ఏ రాష్ట్రానికి చెందిన రైతులకు లాభాల పంట పండి ఆదాయం డబుల్ అయిందో చెప్పాలన్నారు. మరోవైపు రైతుల ఆదాయానికి సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ పెట్టిన పోస్టర్లో ఉన్న రైతు ఓ మోడల్ అని నెటిజన్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి: 'ఇదా మీ భాష?.. ఇవన్నీ కరెక్టేనా?'.. భాజపాపై కేటీఆర్ ఫైర్

ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన పెను ప్రమాదం

ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్స్.. మహీంద్ర ఎస్​యూవీలు అందించిన సంస్థ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.