గణతంత్ర దినోత్సవం సందర్భంగా 901 మందికి పోలీస్ పతకాలు

author img

By

Published : Jan 25, 2023, 3:01 PM IST

Updated : Jan 25, 2023, 3:20 PM IST

Medals for State Police on the occasion of Republic Day

Medals for State Police: ప్రతి సంవత్సరం రాష్ట్రానికి మంచి సేవలు అందించినందుకు ఉత్తమ పోలీసులకు పతకాలను అందజేస్తారు. చాలా మంది పోలీసులు పతకాలు సాధించడం జీవిత ఆశయంగా భావిస్తారు. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పతకాలు పొందే వారి వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఏ విభాగంలో ఎంత మందికి వచ్చాయంటే..?

Medals for State Police: గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక భారత పోలీసు పతకాలను ప్రకటించింది. దేశంలో ఉత్తమ సేవలు అందించినందుకు గుర్తుగా ఈ పతకాలు అందజేస్తారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు, జైళ్లు, అగ్నిమాపక శాఖల్లో పలువురికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ పతకాలు ప్రకటిస్తుంటుంది.

ఈ సంవత్సరం దేశంలో 901 మందికి పోలీసు పతకాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు, జైళ్లు, అగ్నిమాపక శాఖల్లో పలువురికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ పతకాలు ప్రకటిస్తుంటుంది. ఈసారి రాష్ట్రపతి ఉత్తమ సేవా పతకానికి పోలీస్​ శాఖ నుంచి ముగ్గురిని ఎంపిక చేసింది.

  1. 12వ బెటాలియన్​ అదనపు కమాండెంట్​ రామకృష్ణ
  2. ఇంటిలిజెన్స్ ఆదనపు డీజీ అనిల్​ కుమార్
  3. జాతీయ పోలీస్ అకాడమీ జేడీ మధుసూదన్ రెడ్డి​ ఎంపిక అయ్యారు. అదే విధంగా రాష్ట్రంలో 140 మంది పోలీస్​ గ్యాలంట్రీ పతకాలకు ఎంపిక అయ్యారు. 93 మందిని ప్రెసిడింట్​ పోలీస్​ మెడల్స్​కి, 668 మందిని పోలీస్​ మెరిటోరియస్​ సర్వీస్​ మెడల్​కు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.

కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్రింది వారికి పోలీసు పతకాలను ప్రకటించింది.

పతకం పేరుఎంత మందికి
పోలీస్ గ్యాలంట్రీ పతకం(తెలంగాణలో)140
ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్‌(తెలంగాణలో)93
పోలీస్​ మెరిటోరియస్​ సర్వీస్​ మెడల్​668
మెుత్తం901

ఇవీ చదవండి:

Last Updated :Jan 25, 2023, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.