గణతంత్ర దినోత్సవం సందర్భంగా 901 మందికి పోలీస్ పతకాలు
Updated on: Jan 25, 2023, 3:20 PM IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా 901 మందికి పోలీస్ పతకాలు
Updated on: Jan 25, 2023, 3:20 PM IST
Medals for State Police: ప్రతి సంవత్సరం రాష్ట్రానికి మంచి సేవలు అందించినందుకు ఉత్తమ పోలీసులకు పతకాలను అందజేస్తారు. చాలా మంది పోలీసులు పతకాలు సాధించడం జీవిత ఆశయంగా భావిస్తారు. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పతకాలు పొందే వారి వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఏ విభాగంలో ఎంత మందికి వచ్చాయంటే..?
Medals for State Police: గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక భారత పోలీసు పతకాలను ప్రకటించింది. దేశంలో ఉత్తమ సేవలు అందించినందుకు గుర్తుగా ఈ పతకాలు అందజేస్తారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు, జైళ్లు, అగ్నిమాపక శాఖల్లో పలువురికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ పతకాలు ప్రకటిస్తుంటుంది.
ఈ సంవత్సరం దేశంలో 901 మందికి పోలీసు పతకాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు, జైళ్లు, అగ్నిమాపక శాఖల్లో పలువురికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ పతకాలు ప్రకటిస్తుంటుంది. ఈసారి రాష్ట్రపతి ఉత్తమ సేవా పతకానికి పోలీస్ శాఖ నుంచి ముగ్గురిని ఎంపిక చేసింది.
- 12వ బెటాలియన్ అదనపు కమాండెంట్ రామకృష్ణ
- ఇంటిలిజెన్స్ ఆదనపు డీజీ అనిల్ కుమార్
- జాతీయ పోలీస్ అకాడమీ జేడీ మధుసూదన్ రెడ్డి ఎంపిక అయ్యారు. అదే విధంగా రాష్ట్రంలో 140 మంది పోలీస్ గ్యాలంట్రీ పతకాలకు ఎంపిక అయ్యారు. 93 మందిని ప్రెసిడింట్ పోలీస్ మెడల్స్కి, 668 మందిని పోలీస్ మెరిటోరియస్ సర్వీస్ మెడల్కు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్రింది వారికి పోలీసు పతకాలను ప్రకటించింది.
పతకం పేరు | ఎంత మందికి |
పోలీస్ గ్యాలంట్రీ పతకం(తెలంగాణలో) | 140 |
ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్(తెలంగాణలో) | 93 |
పోలీస్ మెరిటోరియస్ సర్వీస్ మెడల్ | 668 |
మెుత్తం | 901 |
ఇవీ చదవండి:
