ఎమ్మెల్యేలకు ఎర కేసు.. జగ్గుస్వామికి లుక్​అవుట్​ సర్య్కులర్..

author img

By

Published : Nov 22, 2022, 10:52 AM IST

Updated : Nov 22, 2022, 2:58 PM IST

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ఆ ముగ్గురిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ

10:46 November 22

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. జగ్గుస్వామికి లుక్​అవుట్​ సర్య్కులర్..

జగ్గు స్వామికి లుక్​ అవుట్​ సర్క్యులర్
జగ్గు స్వామికి లుక్​ అవుట్​ సర్క్యులర్

ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్​ దర్యాప్తు ముమ్మరం చేసింది. కేరళలో జగ్గుస్వామి అందుబాటులో లేకపోవడంతో నిన్న జగ్గుస్వామికి లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్​ సంతోశ్​, తుషార్, జగ్గుస్వామిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. విచారణకు సహకరించాలని బీఎల్​ సంతోశ్​కు హైకోర్టు ఇదివరకే ఆదేశాలు జారీచేసింది.

మరోవైపు నిన్న శ్రీనివాస్​ను సిట్ అధికారులు దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించారు. సింహయాజీతో ఉన్న సంబంధాలపై సేకరించిన ఆధారాలను ముందు పెట్టుకొని మరీ ప్రశ్నించారు. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, ఫామ్​హౌస్​లో జరిగిన సంప్రదింపులపై తనకు ఏమాత్రం అవగాహన లేదని శ్రీనివాస్ చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన నందకుమార్​తోనూ శ్రీనివాస్​కు సత్సంబంధాలే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే న్యాయవాది శ్రీనివాస్​ నేడు మరోసారి సిట్​ ఎదుట హాజరయ్యారు. సిట్ అధికారులు అడిగిన వివరాలతో విచారణకు హాజరయ్యారు.

ఇవీ చూడండి..

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ముగిసిన మొదటిరోజు విచారణ..

'ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. సిట్‌ విచారణ కొనసాగాల్సిందేనన్న సుప్రీంకోర్టు

Last Updated :Nov 22, 2022, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.