గ్రూప్‌-1 మెయిన్స్​ ఎగ్జామ్​ విధానం ఖరారు చేసిన TSPSC

author img

By

Published : Jan 19, 2023, 7:55 AM IST

TSPSC

Telangana Group 1 Mains : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా విధానాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖరారు చేసింది. బుధవారం ప్రత్యేకంగా సమావేశమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్.. మెయిన్స్ పరీక్షా విధానంపై చర్చించింది. నిపుణుల కమిటీ సిఫారసు చేసిన పరీక్షా విధానాన్ని ఆమోదించింది. ఆంగ్లంతో పాటు మిగిలిన ఆరు పేపర్ల పరీక్షా విధానం, ప్రశ్నల స్వరూపాన్ని ఖరారు చేసింది.

Telangana Group 1 Mains : గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల ప్రశ్నపత్రం విధానాన్ని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సులను కమిషన్‌ ఆమోదించింది. ఈ మేరకు పరీక్ష విధానం వివరాలను వెబ్‌సైట్​లో పొందుపరిచింది. ప్రధాన పరీక్షలో ఒక్కోపేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 900 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పదో తరగతి స్థాయిలో ఇంగ్లిష్‌ పరిజ్ఞానంపై 150 మార్కులకు అర్హత పరీక్ష నిర్వహించనుంది.

పరీక్ష విధానం ఇలా..

పేపర్‌-1 : జనరల్‌ ఎస్సే..: ఈ పేపర్‌లో మూడు సెక్షన్‌లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌కు 50 మార్కులు కేటాయించారు. ఒక్కో సెక్షన్‌లో మూడు ప్రశ్నలు ఉంటాయి. ప్రతిసెక్షన్‌లో ఒక ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం రాయాలి. ఇది వెయ్యిపదాల్లో ఉండాలి. మూడు సెక్షన్లకు కలిపి 150 మార్కులు ఉంటాయి.

పేపర్‌-2 : చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ
పేపర్‌-3 : భారతీయ సమాజం, రాజ్యాంగం, పరిపాలన
పేపర్‌-4 : ఎకానమీ, డెవలప్‌మెంట్‌

పేపర్‌-2, 3, 4లలో మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతిసెక్షన్‌లో అయిదు ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఒక్కో సెక్షన్‌కు 50 మార్కులుంటాయి. ప్రశ్నకు సమాధానం 200 పదాల్లో ఇవ్వాలి. ఒక్కోప్రశ్నకు పది మార్కులు ఉంటాయి. అయితే ఒక్కో సెక్షన్‌లో అయిదు ప్రశ్నల్లో తొలిరెండు ప్రశ్నలకు సమాధానం తప్పనిసరిగా ఇవ్వాలి. మూడు, నాలుగు, అయిదు ప్రశ్నల్లో ఛాయిస్‌ ఆప్షన్‌ ఉంటుంది.

పేపర్‌-5 : సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌

ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. మొదటి రెండు సెక్షన్లలో అయిదు ప్రశ్నల చొప్పున ఉంటాయి. ఈ సెక్షన్లలో తొలిరెండు ప్రశ్నలకు తప్పనిసరిగా జవాబు ఇవ్వాలి. మిగతా మూడు ప్రశ్నలకు ఛాయిస్‌ ఉంటుంది. ప్రశ్నలకు సమాధానం 200 పదాల్లో ఉండాలి. ఇక మూడో సెక్షన్‌లో మొత్తం 30 ప్రశ్నలుంటాయి. వీటిలో 25 ప్రశ్నలకు సమాధానమివ్వాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 50 మార్కులు ఉంటాయి.

పేపర్‌-6 : తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు

ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌లో ఐదు ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానం రాయాలి. ప్రతి ప్రశ్నకు సమాధానం 200 పదాల్లో ఇవ్వాలి. ఒక్కోప్రశ్నకు పది మార్కులు చొప్పున మొత్తం 15 ప్రశ్నలకు 150 మార్కులు కేటాయించింది. అయితే ఒక్కో సెక్షన్‌లోని ఐదు ప్రశ్నల్లో తొలి రెండు ప్రశ్నలకు సమాధానం తప్పనిసరి ఇవ్వాలి. ఇందులో ఛాయిస్‌ ఉండదు. మూడు, నాలుగు, ఐదు ప్రశ్నల్లో ఛాయిస్‌ ఆప్షన్‌ ఉంటుంది.
జనరల్‌ ఇంగ్లిష్‌ అర్హత పరీక్ష:

ఇందులో పదిహేను ప్రశ్నలు ఉంటాయి.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.