మండలి ఛైర్మన్‌కు 'ఎంజీ గ్లోస్టర్‌ 6-సీటర్‌ హైఎండ్‌' కారు.. ధర ఎంతంటే?

author img

By

Published : May 13, 2022, 10:19 AM IST

NEW CAR

NEW CAR: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఛైర్మన్‌ కొయ్యె మోషేన్‌రాజుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త వాహనం ఇవ్వనుంది. కొత్త వాహనాల కొనుగోలుపై ఉన్న నిషేధాన్ని సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘ఎంజీ గ్లోస్టర్‌ 6-సీటర్‌ హైఎండ్‌ వెర్షన్‌’ కారు కొనేందుకు ప్రభుత్వం రూ.48 లక్షలు విడుదల చేసింది.

NEW CAR: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఛైర్మన్‌ కొయ్యె మోషేన్‌రాజు కోసం ‘ఎంజీ గ్లోస్టర్‌ 6-సీటర్‌ హైఎండ్‌ వెర్షన్‌’ కారు కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.48 లక్షలు విడుదల చేసింది. కొత్త వాహనాల కొనుగోలుపై ఉన్న నిషేధాన్ని సడలిస్తూ ప్రత్యేక కేసుగా పరిగణించి ఈ అనుమతిస్తున్నట్టు గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ట్రెజరీ నిబంధనల్ని సడలిస్తూ రూ.48 లక్షలు విడుదల చేసేందుకు ఆర్థికశాఖ ఇది వరకే ఆమోద ముద్ర వేసింది. సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు గురువారం పాలనాపరమైన అనుమతులు జారీ చేశారు.

ఇవీ చదవండి:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.