భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్ల విక్రయం వివరాలివే!

author img

By

Published : Sep 22, 2022, 4:13 PM IST

Updated : Sep 22, 2022, 9:35 PM IST

Cricket match Online tickets available after 7pm tonight

16:10 September 22

భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్ల విక్రయం వివరాలివే!

సికింద్రాబాద్ జింఖానా మైదానంలో భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు సంబంధించిన ఆఫ్‌లైన్‌ టికెట్ల విక్రయాలు పూర్తయినట్లు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) నిర్వాహకులు వెల్లడించారు. అయితే, ఆన్‌లైన్‌ టికెట్లు ఈరోజు రాత్రి 7 తర్వాత అందుబాటులోకి తీసుకువచ్చారు. తీసుకువచ్చిన కొద్ది నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడుపోయాయి. ఇక ఆఫ్‌లైన్‌లో టికెట్లను సికింద్రాబాద్ జింఖానా స్టేడియంలో ఈనెల 23 నుంచి 25 వరకు విక్రయించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టికెట్లను విక్రయించనున్నారు. ఈనెల 25న భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ ఉప్పల్‌ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ వీక్షించడం కోసం టికెట్ల కొనుగోలు కోసం ఈరోజు అంచనాలకు మించి క్రికెట్‌ అభిమానులు వచ్చారు. భారీ సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొంతమంది అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు.

ఇవీ చూడండి:

Last Updated :Sep 22, 2022, 9:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.