Telangana Corona: రాష్ట్రంలో కొత్తగా 2,319 కరోనా కేసులు, ఇద్దరు మృతి

author img

By

Published : Jan 12, 2022, 7:37 PM IST

Updated : Jan 12, 2022, 8:16 PM IST

రాష్ట్రంలో కొత్తగా 2,319 కరోనా కేసులు, ఇద్దరు మృతి

19:36 January 12

Telangana Corona: రాష్ట్రంలో కొత్తగా 2,319 కరోనా కేసులు, ఇద్దరు మృతి

corona cases: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 90,021 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,319 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,00,094కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

corona active cases: తాజాగా రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,047కు చేరింది. కరోనా బారి నుంచి కొత్తగా 474 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18,339 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్​ఎంసీ పరిధిలో కొత్తగా 1,275 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

కొవిడ్​ విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్​ వ్యాక్సినేషన్​ కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 2.51లక్షల మంది వ్యాక్సిన్​ తీసుకున్నారు. మరోవైపు 36,691 మంది కొవిడ్​ బూస్టర్​ డోసు తీసుకున్నారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్​ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:

Last Updated :Jan 12, 2022, 8:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.