'పంట ధరలకు రాజ్యాంగపరమైన భద్రత ఉండాలి.. ఆ దిశగా రైతు నాయకుల పోరాటం సాగాలి'

author img

By

Published : May 22, 2022, 6:23 PM IST

Updated : May 22, 2022, 8:18 PM IST

CM KCR

CM KCR Distributed Cheques: గల్వాన్ లోయలో అమరులైన జవాన్ కుటుంబాలకు, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థికసాయం అందించారు. ఇవాళ ఆయన చండీగఢ్​లో పర్యటించారు. రైతులు, జావాన్ల కుటుంబాలను దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్​ సీఎం భగవంత్ సింగ్ మాన్​తో కలిసి పరామర్శించారు. అనంతరం వారి సమక్షంలో జవాన్, కిసాన్ కుటుంబసభ్యులకు చెక్కులు అందజేశారు.

'పంట ధరలకు రాజ్యాంగపరమైన భద్రత ఉండాలి.. ఆ దిశగా రైతు నాయకుల పోరాటం సాగాలి'

CM KCR Distributed Cheques: రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలే మారుతాయని సీఎం కేసీఆర్ అన్నారు. రైతులు పండించిన పంటలకు మంచి మద్దతు ధర రావాలని ఆకాంక్షించిన సీఎం... అందుకు రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయంపై ఇప్పటికీ ఆంక్షలు విధిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. సాగుకు ఉచితంగా విద్యుత్ ఇస్తుంటే మీటర్లు పెట్టాలని అంటోందని సీఎం తెలిపారు. ఉత్తరాది పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ చండీగఢ్​లో పర్యటించారు. రైతులు, జవాన్ల కుటుంబాలను సీఎం కేసీఆర్‌, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించారు. చంఢీగఢ్‌లోని ఠాగూర్‌ స్టేడియంలో రైతుల కుటుంబాలను ఇరువురు ముఖ్యమంత్రులు పరామర్శించారు. రైతు ఉద్యమంలో అమరులైన అన్నదాతలకు నివాళులర్పించారు. అనంతరం ఠాగూర్ స్టేడియంలో రైతుల కుటుంబాలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ప్రసంగం తర్వాత గాల్వన్‌లోయ ఘర్షణలో అమరులైన జవాన్ల కుటుంబాలకు, అమరులైన రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేశారు. దిల్లీ, పంజాబ్‌ సీఎంల సమక్షంలో 600 కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేశారు.

రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలే మారుతాయి. రైతులు పండించిన పంటలకు మంచి ధర రావాలి. ఇందుకు రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాలి. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అలా చెబితే.. వారికే మనం మద్దతివ్వాలి. ఇదే స్ఫూర్తి దేశవ్యాప్తంగా మన రైతు నాయకులు తీసుకొస్తే.. ఇది సాధ్యం అవుతుంది. మీరు చేసే ఆందోళనకు మా మద్దతు ఉంటుంది. మన డిమాండ్లు కేంద్రం అంగీకరించేవరకు మన పోరాటం కొనసాగాలి. అప్పటివరకు రైతు నాయకులకు మా మద్దతు ఉంటుంది.-- సీఎం కేసీఆర్

మీ పోరాటానికి సలాం: కేంద్రం సాగుచట్టాలు రద్దు చేసేంతవరకు రైతులు పోరాడారని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది చాలా బాధాకరమైన సందర్భమన్న ఆయన... రైతుల సమస్యలకు పరిష్కారం ఇంకా దొరకట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పోరాట స్ఫూర్తికి సలాం చేస్తున్నానని తెలిపారు. దేశ చరిత్రలో పంజాబ్‌ రైతులు రెండు గొప్ప పోరాటాలు చేశారని కొనియాడారు. భగత్‌సింగ్‌ వంటి వీరులు ప్రాణాలు అర్పించి స్వాతంత్య్రం సాధించారని పేర్కొన్నారు. పంజాబ్‌ యువకులు సైన్యంలో చేరి దేశాన్ని కాపాడుతున్నారన్న సీఎం... హరితవిప్లవంతో పంజాబ్‌ రైతులు దేశం ఆకలిని తీర్చారని స్పష్టం చేశారు. సాగుచట్టాలు రద్దు చేయించి వ్యవసాయాన్ని కాపాడారని సీఎం అభినందించారు. రైతుల పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు ఇచ్చినట్లు గుర్తుచేశారు. భాజపాను ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు.

'పంజాబ్ రైతుల పోరాట స్ఫూర్తికి సలాం'

ఇది చాలా బాధాకరమైన సందర్భం. రైతుల సమస్యలకు పరిష్కారం ఇంకా దొరకట్లేదు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా దేశం పరిస్థితి మారలేదు. కేంద్రం సాగుచట్టాలు రద్దు చేసేంతవరకు రైతులు పోరాడారు. పంజాబ్‌ రైతుల పోరాట స్ఫూర్తికి సలాం చేస్తున్నా. సాగుచట్టాలు రద్దు చేయించి వ్యవసాయాన్ని కాపాడారు. రైతుల పోరాటానికి మేం సంపూర్ణ మద్దతు ఇచ్చాం. కేంద్ర సర్కార్‌ వ్యవసాయంపై ఇప్పటికీ ఆంక్షలు విధిస్తోంది. సాగుకు ఉచితంగా విద్యుత్ ఇస్తుంటే మీటర్లు పెట్టాలని అంటోంది. భాజపాను ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర వేస్తున్నారు. -- సీఎం కేసీఆర్

దిల్లీ సరిహద్దులో రైతులు ఏడాదికి పైగా చేసిన పోరాటం కేవలం పంజాబ్‌, హరియాణాకు చెందినది కాదని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. యావత్‌ దేశ ప్రయోజనాల కోసం రైతులు పోరాడారని కొనియాడారు. రైతుల ఉద్యమానికి చాలా రాష్ట్రాలు మద్దతు తెలిపాయన్న ఆయన... ఆందోళనలో పాల్గొన్న రైతులకు దిల్లీ ప్రభుత్వం అండగా నిలిచిందని గుర్తుచేశారు.

దిల్లీ సరిహద్దులో రైతులు ఏడాదికి పైగా పోరాటం చేశారు. రైతుల ఉద్యమం పంజాబ్‌, హరియాణాకు చెందినది కాదు. యావత్‌ దేశ ప్రయోజనాల కోసం రైతులు పోరాడారు. రైతుల ఉద్యమానికి చాలా రాష్ట్రాలు మద్దతు తెలిపాయి. ఆందోళనలో పాల్గొన్న రైతులకు దిల్లీ ప్రభుత్వం అండగా నిలిచింది. ఎండ, వాన, చలిలో ఉన్న రైతులకు కొంత సహాయం చేయగలిగాం. దిల్లీ స్కూల్స్‌, ఆస్పత్రులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. -- అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ సీఎం

రైతుల ఉద్యమానికి కేసీఆర్‌, కేజ్రీవాల్ మద్దతు ఇచ్చారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ తెలిపారు. రైతుల ఉద్యమానికి చాలా రాష్ట్రాలు మద్దతుగా నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, దిల్లీ, పంజాబ్​ సీఎంలతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, రైతుల కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

Last Updated :May 22, 2022, 8:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.