వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడితే.. రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరు: చంద్రబాబు

author img

By

Published : Nov 19, 2022, 6:28 PM IST

వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడితే.. రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరు

CBN FIRES ON CM JAGAN : ఆంధ్రప్రదేశ్​లో ఇంతటి దారుణమైన.. నీచమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని.. గత మూడున్నరేళ్ల కాలంలో రాష్ట్రంలో ఎంతో విధ్వంసం జరిగిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో భాగంగా ‘ఇదేం ఖర్మ’ పేరిట కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు.

CBN FIRES ON YSRCP: రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎన్నో దారుణాలు జరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఈ దారుణాలన్నీ పోలీసుల సహకారంతో ప్రభుత్వమే చేసిందని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడే కాదు.. ప్రతిపక్షంలో ఉన్నా అంతే బాధ్యతగా ఉన్నామని చంద్రబాబు తెలిపారు.

మూడున్నరేళ్లలో రాష్ట్రంలో ఎంతో విధ్వంసం: ఇదేం ఖర్మ పేరుతో టీడీపీ ప్రచార కార్యక్రమాన్ని పార్టీ అధినేత ప్రారంభించారు. జాతీయ భావాలతో ముందుకెళ్తున్న పార్టీ తెలుగుదేశం అని.. ప్రాంతీయ భావాలతోనే కాకుండా జాతీయ భావాలతో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు అదే బాధ్యతగా ఉన్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో తెదేపా ఒక నమూనా అని .. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడే పార్టీ తెలుగుదేశం అని తేల్చిచెప్పారు. మూడున్నరేళ్లుగా తెదేపాపై దాడులు చేస్తూనే ఉన్నారని.. రాత్రిళ్లు అరెస్టు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇంతటి దారుణ, నీచమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని తెలిపారు. మూడున్నరేళ్లలో రాష్ట్రంలో ఎంతో విధ్వంసం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

"అధికార పార్టీకి చెందిన ఓ ఫ్లెక్సీ తగులబడితే పోలీసులను రంగంలోకి దింపారు. తునిలో తెదేపా నేత మీద హత్యాయత్నం జరిగితే ఆ పోలీసులు ఎక్కడున్నారు? నాపై పూలేస్తే ఆ పూలల్లో రాళ్లున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇవాళ పూలల్లో రాళ్లున్నాయన్నారు.. రేపు అవే పూలల్లో బాంబు ఉందని అంటారా? నాపై రాళ్లేస్తే భయపడి పర్యటనలు మానుకుంటానని అనుకుంటున్నారా? అచ్చెన్నాయుడిని వేధించడంతో ప్రభుత్వం దారుణాలకు తెర లేపింది. ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీస్ కస్టడీలో ఉండగానే చంపే ప్రయత్నం చేశారు. కోర్టులు తప్పు పట్టినా ప్రభుత్వం భయపడటం లేదు. ఇవాళే కాదు.. రేపు అనేది కూడా ఉంటుందని పోలీసులు గుర్తుంచుకోవాలి. తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతాం"-టీడీపీ అధినేత చంద్రబాబు

ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత : నేడు రాష్ట్రంలో ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్‌ అంధకారం అయిపోతుందని భయమేస్తోందన్నారు. ఎంతమందిపై కేసులు పెట్టుకుంటూ పోతారని నిలదీశారు. విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారని..ప్రజల్లో వైకాపా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. డిసెంబర్ 1 నుంచి 'ఇదేం ఖర్మ' కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.

రాష్ట్రాభివృద్ది కోసమే టీడీపీ గెలుపు: టీడీపీ గెలుపు తన కోసమో, పార్టీ కోసమో కాదని.. రాష్ట్రాభివృద్ధి కోసం అని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం కోసం తన ప్రాణాలైనా ఇస్తాను కానీ వెనక్కిపోనని స్పష్టం చేశారు. కర్నూల్లో హైకోర్టు కావాలని గతంలో జగన్‌ ఎందుకు అడగలేదని నిలదీశారు. విశాఖలో పరిపాలనా రాజధాని కావాలని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. అప్పుడు అమరావతే రాజధానిగా ఉండాలని ఎందుకు ఒప్పుకున్నారని విమర్శించారు. తునిలో మా నేతపై హత్యాయత్నం జరిగితే పోలీసులు ఎక్కడున్నారని నిలదీశారు. నా మీద రాళ్లేస్తే భయపడి పర్యటనలు ఆపేస్తామని ప్రభుత్వ ఉద్దేశమన్న బాబు.. రాళ్లు వేసినంత మాత్రాన భయపడే పార్టీ కాదని తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడితే.. రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.