cm jagan Delhi tour: రేపు దిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్

author img

By

Published : Sep 24, 2021, 3:42 PM IST

ap cm

ఏపీ ముఖ్యమంత్రి జగన్.. శనివారం దిల్లీకి వెళ్లనున్నారు (cm jagan Delhi tour). గన్నవరం విమానాశ్రయం నుంచి రేపు సాయంత్రం హస్తినాకు(Delhi) బయలుదేరనున్నారు.

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్.. రేపు దిల్లీకి వెళ్లనున్నారు(cm jagan Delhi tour). రేపు సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరనున్నారు. ఈనెల 26న కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Home Minister Amit Shah) నేతృత్వంలో జరిగే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో జగన్​ పాల్గొంటారు. అపాయింట్​మెంట్ దొరికితే హోం మంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులను ప్రత్యేకంగా కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు రెండు రోజులపాటు దిల్లీలో జగన్​ పర్యటన కొనసాగనుంది.

ఆదివారం ఉదయం 11 గంటలకు దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో ఈ భేటీ జరుగనుంది. ఇందులో ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల సీఎంలు పాల్గొనే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: Cm KCR tour in Delhi: ఈనెల 25న మరోసారి హస్తినకు సీఎం కేసీఆర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.