'రేవంత్ చెబితేనే నేషనల్​ హెరాల్డ్​కు విరాళాలు ఇచ్చాను..'

author img

By

Published : Nov 23, 2022, 3:32 PM IST

Updated : Nov 23, 2022, 4:07 PM IST

ED

National Herald case: నేషనల్​ హెరాల్డ్​ కేసులో అంజన్​ కుమార్​ విచారణ ముగిసింది. ఉదయం 11గంటలు నుంచి మధ్యాహ్నం 2 గంటలు వరకు ఆయన్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. యంగ్​ ఇండియా సంస్థకు విరాళాలు గురించి ఈడీ అధికారులు ఆయన్ను ప్రశ్నించినట్లు​ తెలిపారు.

National Herald case: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్​ హెరాల్డ్​ కేసులో ఈడీ అధికారులు ఒక్కొక్కరిని పశ్నిస్తున్నారు. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ కాంగ్రెస్​ నేత అంజన్​ కుమార్​ను ఈరోజు ఈడీ అధికారులు విచారించారు. ఉదయం 11 గంటలు నుంచి మధ్యాహ్నం 2 గంటలు వరకు ప్రశ్నించిన ఈడీ.. యంగ్​ ఇండియా లిమిటెడ్​కు విరాళాలు సేకరణ గురించి ఆయన్ను ప్రశ్నించారు.

దీనిపై మాట్లాడిన అంజన్​ కుమార్​ రేవంత్​ రెడ్డి సూచన మేరకే ఆ సంస్థకు విరాళాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. సంస్థ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందనే కారణంగా స్వచ్ఛందంగా విరాళం ఇచ్చినట్లు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్​పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తమ నేతలను ఈడీ విచారిస్తోందని ఆయన ఆరోపించారు. మళ్లీ విచారణ ఉంటే ఈడీ అధికారులు పిలుస్తామని ఆయన తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 23, 2022, 4:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.