హైదరాబాద్​లో అమిత్ ​షా.. సాయంత్రం బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు

author img

By

Published : May 14, 2022, 3:49 PM IST

Updated : May 14, 2022, 5:12 PM IST

amit shah reached hyderabad and will address at public meeting in thukkuguda

Amit Shah Tour: కేంద్ర హోం మంత్రి అమిత్​ షా హైదరాబాద్​ చేరుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట్​ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు భాజపా నేతలు ఘన స్వాగతం పలికారు. సాయంత్రం తుక్కుగూడలో జరగనున్న బహిరంగ సభలో అమిత్​ షా పాల్గొంటారు.

Amit Shah Tour: కేంద్ర హోం మంత్రి అమిత్​ షా హైదరాబాద్​​ చేరుకున్నారు. బేగంపేట్​ విమానాశ్రయంలో అమిత్​ షాకు కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి, పార్టీ నేతలు ధర్మపురి అర్వింద్​, రఘునందన్​ రావు, రాజాసింగ్​, పొంగులేటి సుధాకర్​, సోయం బాపురావు, ఈటల రాజేందర్​, విజయ శాంతి, లక్ష్మణ్​, వివేక్​ వెంకట స్వామి, ఇంద్ర సేనా రెడ్డి, డీకే అరుణ, బండ కార్తీక తదితరులు స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట్​ నుంచి ఉప్పల్​ రామంతపూర్​లోని సెంట్రల్​ ఫోరెన్సిక్​ సైన్స్​ ల్యాబొరేటరీ(సీఎఫ్​ఎస్​ఎల్)​కు అమిత్​షా బయలుదేరారు.

అమిత్‌షాకు స్వాగతం పలికిన భాజపా నేతలు

కోర్​ కమిటీతో మీటింగ్​..: సీఎఫ్​ఎస్​ఎల్​లో నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్​ను అమిత్​ షా ప్రారంభించారు. ల్యాబ్​ విశేషాల గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌కు వెళ్లారు. కాసేపట్లో భాజపా కోర్​ కమిటీతో అమిత్​ షా సమావేశం కానున్నారు.

అనంతరం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్న బహిరంగ సభలో అమిత్​ షా పాల్గొననున్నారు. బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగూడలో భారీ సభ ఏర్పాటు చేశారు. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో 31 రోజులపాటు సుమారు 400 కి.మీకు పైగా బండి సంజయ్​ పాదయాత్ర కొనసాగింది. రాత్రి 8 గంటల వరకు జరిగే బహిరంగ సభలో పాల్గొని.. ప్రజలను ఉద్దేశించి అమిత్​ షా ప్రసంగిస్తారు. సభ అనంతరం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి తిరిగి దిల్లీ పయనమవుతారు.

ఇవీ చదవండి: 'ఏ మొహం పెట్టుకుని వస్తారు'.. అమిత్‌షాకు రేవంత్‌ రెడ్డి 9 ప్రశ్నలు

ట్రెండ్ మార్చిన సాధువులు.. ఫైవ్ స్టార్ హోటళ్లలో సమావేశాలు

Last Updated :May 14, 2022, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.