నాలుగు రోజుల క్రితం వరకు కేవలం 200క్యూసెక్కుల ఇన్ప్లో మాత్రమే ఉండగా ప్రస్తుతం 16 వేల క్యూసెక్కులకు చేరుకుంది. కిన్నెరసాని ప్రాజెక్ట్ సామర్థ్యం 407 అడుగులు కాగా శుక్రవారం ఉదయం వరకు 405 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ఇన్ప్లో భారీగా పెరగడంతో కిన్నెరసాని ప్రాజెక్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఒక గేటు ఎత్తి 16 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టారు.
పాల్వంచ,బూర్గంపాడు మండల గ్రామాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తక్కువ ఎత్తు కలిగిన బ్రిడ్జీలు దాటేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కిన్నెరసాని ప్రాజెక్ట్ అధికారులు సూచించారు.
ఇదీ చదవండి:LIVE UPDATES: భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం