Bhatti on Kaleshwaram ఎన్ని అడ్డంకులు సృష్టించినా తగ్గేదేలే అంటున్న భట్టి

author img

By

Published : Aug 17, 2022, 3:38 PM IST

Updated : Aug 17, 2022, 5:17 PM IST

Bhatti

Bhatti on Kaleshwaram రాష్ట్ర ప్రభుత్వం తమపై అవలంభిస్తున్న వైఖరిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ఖండించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తామని భట్టి వెల్లడించారు.

Bhatti on Kaleshwaram: ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసిన రూ.లక్షల కోట్లు వరదలో కొట్టుకుపోయాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రాజెక్టులు, ముంపు ప్రాంతాలు సందర్శించకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని భట్టి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అణచివేత చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శిస్తామని స్పష్టం చేశారు.

Bhatti fire on trs ప్రజలను కలవకుండా సీఎల్పీ బృందాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. వరద ముంపు ప్రాంతాల్లో నష్టాలను ప్రభుత్వం అంచనా వేయలేదని భట్టి ఆరోపించారు. టెర్రరిస్టుల మాదిరిగా ఇల్లందు గెస్ట్​హౌస్‌లో తమను బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాన్ని అణచివేసేందుకే పోలీసులను ప్రభుత్వం వాడుకుంటుందని భట్టి విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యక్రమం ఆగేది లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

భూపాలపల్లిలో అడ్డుకున్న పోలీసులు: కాళేశ్వరం సందర్శనకు వెళ్తున్న సీఎల్పీ నేతలను పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ నేతల్ని భూపాలపల్లిలో నిలువరించారు. సందర్శనకు అనుమతి లేదని డీఎస్పీ రాములు వారికి వివరించారు. డీఎస్పీ రాములు తీరుపై భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్ని అడ్డంకులు సృష్టించినా తగ్గేదేలే, భట్టి

సొమ్మసిల్లి పడిపోయిన భట్టి: భూపాలపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్తున్న సీఎల్పీ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇరువురి మధ్య జరిగిన తోపులాటలో భట్టి విక్రమార్క సొమ్మసిల్లి పడిపోయారు.

ఇవీ చదవండి: వెయ్యి కిలోమీటర్ల మైలు రాయి చేరుకున్న బండి పాదయాత్ర

భాజపా అనూహ్య నిర్ణయం, పార్లమెంటరీ బోర్డు నుంచి గడ్కరీ ఔట్

Last Updated :Aug 17, 2022, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.