Maoist surrender: 53 మంది మావోయిస్టు సానుభూతిపరులు లొంగుబాటు

author img

By

Published : Sep 9, 2021, 2:14 PM IST

Updated : Sep 9, 2021, 2:59 PM IST

52 మంది మావోయిస్టు సానుభూతిపరులు లొంగుబాటు

14:12 September 09

53 మంది మావోయిస్టు సానుభూతిపరులు లొంగుబాటు

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎత్తున మావోయిస్టు సానుభూతిపరులు లొంగిపోయారు. మావోయిస్టు సానుభూతిపరులుగా, మిలీషియా సభ్యులుగా, గ్రామ కమిటీ సభ్యులుగా పనిచేస్తున్న 53 మంది ఎస్పీ సునీల్​దత్, సీఆర్పీఎఫ్ కమాండెంట్ ఎదుట లొంగిపోయారు. 

   లొంగిపోయిన వారు చర్ల మండలంలోని పూసగొప్ప, బత్తినపల్లి, బట్టిగూడెం, చెన్నాపురం గ్రామాల వారని అధికారులు వెల్లడించారు. వీరిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. మావోయిస్టులంతా.. వారి సిద్ధాంతాలను వదిలిపెట్టి పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ సునీల్​దత్ సూచించారు.

ఇదీ చూడండి: ఎన్నికల ముందు కలకలం.. అసెంబ్లీ వెబ్​సైట్​ హ్యాక్​!

Last Updated :Sep 9, 2021, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.