Tension over tribal varsity committee concern: గిరిజన వర్సిటీ సాధన కమిటీ ఆందోళనలో ఉద్రిక్తత

author img

By

Published : Jan 3, 2022, 1:12 PM IST

Tension over tribal varsity committee concern

Tension over tribal varsity committee concern : గిరిజన విశ్వవిద్యాలయాన్ని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు, వర్శిటీ సాధన కమిటీ ఆదిలాబాద్‌లో ఆందోళన చేపట్టారు. కుమురం భీం చౌరస్తాలో నిరసన వ్యక్తం చేస్తూ... కలెక్టర్‌, ఎస్పీ వాహనాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

గిరిజన వర్సిటీ సాధన కమిటీ ఆందోళనలో ఉద్రిక్తత

Tension over tribal varsity committee concern : గిరిజన విశ్వవిద్యాలయాన్ని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్‌లో విద్యార్థులు, వర్శిటీ సాధన కమిటీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కుమురం భీం చౌక్‌లో ఆందోళనకు దిగిన విద్యార్థులు... కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ , ఎస్పీ వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.

విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయాలని నినానాదాలు చేస్తూ విద్యార్థులు రహదారిపైనే బైఠాయించారు. లాఠీచార్జ్‌తో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. పలువురి అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశారు..

ఇదీ చదవండి: Case registered against MP Arvind: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కేసు నమోదు.. ఏమైందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.