అర్ధనారీశ్వరుడిని దర్శించుకోవాలంటే సాహసయాత్ర చేయాల్సిందే!

author img

By

Published : Aug 31, 2021, 8:41 AM IST

mallikarjuna-swamy-temple

ఈ ఫోటో చూస్తే వరదలు వచ్చి ముంపునకు గురైన ఊర్లో వాళ్లని తాళ్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. మరి ఫోటో వెనుక అసలు కథ ఏంటో చదివి తెలుసుకోండి.

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ మల్లికార్జున స్వామి ఆలయం చెరువు మధ్యలో ఉంటుంది. శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయానికి చారిత్రక ప్రాశస్త్యం ఉంది. గ్రామంలో నెలకొన్న కరవుని పారదోలడానికి శివుడే స్వయంగా రాత్రికి రాత్రి ఈ చెరువును తవ్వి మధ్యలో లింగరూపంలో వెలిశాడని ఐతిహ్యం. వర్షాకాలంలో ఈ చెరువు నిండినప్పుడు కూడా భక్తులు 3-4 అడుగుల లోతు నీటిలో దాదాపు 500 మీటర్లు నడుచుకుంటూ వెళ్లి స్వామిని దర్శించుకుని పూజలు చేస్తారు.

పూజలు చేస్తున్న భక్తులు

శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్దసంఖ్యలో తాడు సాయంతో నీటిలో నడుచుకుంటూ వెళ్లి స్వామిని దర్శించుకున్నారు.

ఇదీ చూడండి: jeevitham foundation: వందలాది అభాగ్యులకు 24ఏళ్ల యువతే 'అమ్మ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.