DHARNA ON HIGHWAY: జాతీయ రహదారిపై వివాహిత కుటుంబ సభ్యుల ధర్నా

author img

By

Published : Aug 27, 2021, 1:10 PM IST

our-girl-was-murdered

పెళ్లై 7 నెలలే అవుతుంది... అన్యోన్యంగా జీవిస్తున్నారు అని అనుకున్నారు. కాని ఏమి జరిగిందో తెలియదు...ఆ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇది ఆత్మహత్య కాదు ఆమె భర్త తరపువారు హత్య చేశారంటూ ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.. ఆదిలాబాద్ జిల్లా బజార్హట్నూర్ మండలం కాండ్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆదిలాబాద్ జిల్లా బజార్హట్నూర్ మండలం కాండ్లీకి చెందిన సంగీతకు నెరడిగొండ మండలం సవర్గంకు చెందిన విజయ్​తో 7 నెలల క్రితం వివాహం జరిగింది. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో నెరడిగొండలోని సవర్గమ్​లోని ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న మహిళ కుటుంబ సభ్యులు, బంధువులు నెరడిగొండ పోలీసు స్టేషన్ ముందు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.

దాదాపు అరగంట సేపు ధర్నా చేసిన మహిళ కుటుంబ సభ్యులు.. పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. వీరి ఆందోళనతో కాసేపు ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

ఇదీ చదవండి: ఎస్బీఐ బ్యాంక్​లో అగ్ని ప్రమాదం.. కంప్యూటర్లు, దస్త్రాలు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.