ప్రపంచ బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​ ప్రీక్వార్టర్స్​కు నిఖత్​ జరీన్​

author img

By

Published : Mar 19, 2023, 6:03 PM IST

Updated : Mar 19, 2023, 6:34 PM IST

nikhat zareen to pre quarter finals in iba

భారత స్టార్​ బాక్సర్ నిఖత్​ జరీన్​ ప్రపంచ మహిళల బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​ ప్రీ-క్వార్టర్స్​కు చేరుకుంది. ఆఫ్రికన్​ ఛాంపియన్​ అల్జీరియాకు చెందిన బౌలమ్​ రౌమైసాను ఓడించి తదుపరి మ్యాచ్​లు ఆడేందుకు అర్హత సాధించింది.

తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ మహిళల బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లో ప్రీ-క్వార్టర్స్​ మ్యాచ్​లు ఆడేందుకు అర్హత సాధించింది. ఆదివారం దిల్లీలోని కేడీ జాదవ్​ ఇండోర్​ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్​లో ఆఫ్రికన్​ ఛాంపియన్ అల్జీరియాకు చెందిన బౌలమ్​ రౌమైసాతో తలపడింది నిఖత్.​ 5-0 ఏకపక్ష స్కోర్​తో ప్రత్యర్థిని ఓడించి ప్రీ-క్వార్టర్స్ ఫైనల్​ బెర్త్​ను ఖాయం చేసుకుంది.

50 కేజీల ఈవెంట్​లో పోటీపడిన నిఖత్​ ప్రస్తుత ఆఫ్రికన్​ ఛాంపియన్​ రౌమైసాను ఓడించడం ద్వారా ఈ టోర్నమెంట్​లో తన రెండవ విజయాన్ని నమోదు చేసుకుంది. మ్యాచ్​ ఆరంభంలో బాక్సర్లు ఇద్దరూ ఎంతో ఆచితూచి జాగ్రత్తగా ఆడారు. అయితే ఆట మొదటి రౌండ్​లో నిఖత్​కు తన ఆటతీరుతో విజృంభించింది. దీంతో ఆ రౌండ్​ ఆమెకు అనుకూలంగా మారినట్లయింది.

ఈ క్రమంలో ప్రత్యర్థి రౌమైసా కూడా ముందుకు వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించగా నిఖత్​ పంచ్​లతో ఆమెను ఆలౌట్​ చేసింది. అనంతరం తదుపరి రౌండ్​ను ప్రారంభించారు అంపైర్లు. కాగా, ఈ ఆటలో ఇద్దరు బాక్సర్లు ఎంతో దూకుడుగా ఆడారు. ఎన్నో బాడీ షాట్ల వ్యూహాలను ఒకరిపై ఒకరు ప్రయెగించకున్నారు. కానీ, చివరకు 5-0తో వార్​ వన్​ సైడ్​ చేసి విజేతగా నిలిచింది నిఖత్​ జరీన్​. గతేడాది జరిగిన కామన్​వెల్త్​ గేమ్స్​-2022లో స్వర్ణం సాధించిన నిఖత్​ జరీన్​ వరల్డ్​ బాక్సింగ్​ ఛాంపియన్​లలో ఒకరుగా ఉన్నారు.

"రౌమైసా టాప్​ సీడ్​ కావడం వల్ల రౌండ్​లో ఆమెకు దీటుగా ఆడడం చాలా ముఖ్యం. నేను టాప్ సీడ్‌లుగా ఉన్న ఛాంపియన్లను ఓడిస్తే నాపై న్యాయనిర్ణేతలకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఇంతకుముందు నేను బౌలమ్​ రౌమైసా బౌట్​లను చూశాను. బాక్సింగ్​ చేసేటప్పుడు మనం ఆమెకు అత్యంత దగ్గరగా వెళ్తే తాను చాలా దూకుడుగా ఆడుతుంది. కాబట్టి ఆ అవకాశం ఆమెకు ఇవ్వకుండా చాలా దూరం నుంచి ఆడాలని లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగాను. కానీ, తన వ్యూహాత్మకమైన షాట్​తో నేను ఆమె నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్నాను."
-వరల్డ్​ ఛాంపియన్​ బాక్సర్​ నిఖత్ జరీన్​

గతేడాది వరల్డ్​ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌తో పాటు కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం​ గెలిచిన తెలంగాణ యువతి నిఖత్​​ దిల్లీలో జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్​ ఛాంపియన్​షిప్స్​లో ఫేవరెట్‌గా నిలిచి ప్రీ-క్వార్టర్స్​లో ఆడేందుకు అర్హత పొందింది. అయితే ఒలింపిక్స్‌ ఆటలో గోల్డ్​ మెడల్​ సాధించే వరకు తాను విశ్రమించేది లేదని భారత స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ తాజాగా పునరుద్ఘాటించింది. ఇకపోతే తదుపరి 32వ మ్యాచ్​ ప్రపంచ మహిళల బాక్సింగ్​ ఛాంపియన్​షిప్-2022 కాంస్య పతక విజేత హరియాణా బాక్సర్​ మనీషా మౌన్ ఆస్ట్రేలియాకు చెందిన రహీమి టీనా మధ్య జరగనుంది. అయితే వీరిద్దరూ 57 కేజీల విభాగంలో తలపడనున్నారు.

Last Updated :Mar 19, 2023, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.