హాకీ స్టిక్​కు ఎక్స్​ట్రా ఛార్జ్​.. ఆ విమానయాన సంస్థపై ఒలింపిక్​ విన్నర్​ అసంతృప్తి

author img

By

Published : Sep 26, 2022, 8:21 PM IST

Updated : Sep 26, 2022, 8:49 PM IST

.

స్టార్​ హాకీ ప్లేయర్ శ్రీజేష్.. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్​లైన్స్​పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఏం జరిగిందంటే..

స్టార్​ హాకీ ప్లేయర్​, ఒలింపిక్​ కాంస్య పతక విజేత శ్రీజేష్ పీఆర్​​.. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్​లైన్స్​పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. హాకీ స్టిక్​ను తనతో పాటు విమానంలో తీసుకెళ్లేందుకు సదరు సంస్థ.. సాధారణ ఛార్జీ కన్నా ఎక్కువ మొత్తంలో వసూలు చేసిందని ట్వీట్​ చేశాడు.

శ్రీజేష్​.. తన షెడ్యూల్​లో భాగంగా కొచిలో ఓ మ్యాచ్​ ఆడేందుకు వెళ్లాల్సి ఉండగా.. అతడు దేవనహల్లి, కెంపెగౌడ ఎయిర్​పోర్ట్​ నుంచి ఇండిగో 6ఈ 382 విమానం ద్వారా ప్రయాణించాడు. అయితే తనతో పాటు 41 అంగులాల హాకీ స్టిక్​ను కూడా తీసుకెళ్లాడు. అయితే ఫ్లైట్​ ఎక్కేముందు అక్కడి సిబ్బంది.. నిబంధనల ప్రకారం 38 అంగలాల మించి హాకీ స్టిక్ పొడవు ఉన్నందున అదనపు ఛార్జీలు వసూలు చేశారు. చేసేదేమి లేక అతడు ఎక్స్​ట్రా ఛార్జీ చెల్లించి తన గమ్యానికి చేరుకున్నాడు.

అయితే ఈ విషయాన్ని సోషల్​మీడియాలో ట్వీట్​ చేశాడు. "ఎఫ్​ఐహెచ్​ 41 అంగులాల పొడువున్న హాకీ స్టిక్ ఆడేందుకు అనుమతి ఇచ్చింది. కానీ ఇండిగో ఎయిర్​లైన్స్​ మాత్రం 38 అంగులాల మించి తీసుకెళ్లకూడదని.. నా హాకీ స్టిక్​ను తీసుకెళ్లేందుకు నిరాకరించింది. ఏం చేయను? అదనంగా రూ.1500 చెల్లించి దాన్ని తీసుకెళ్లాల్సి వచ్చింది" అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం ఈ ట్వీట్​ వైరల్​గా మారింది. దీనిపై సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా స్పందించారు. కొంతమంది అతడికి మద్దతుగా నిలవగా.. మరికొంతమంది మాత్రం నిబంధనలు అందరికీ వర్తిస్తాయి అని అంటున్నారు.

ఇదీ చూడండి: డీన్‌కు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చా: రనౌట్​పై దీప్తి శర్మ వివరణ

Last Updated :Sep 26, 2022, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.