National Sports Day: క్రీడా దినోత్సవానికి కారణం అతడే!

author img

By

Published : Aug 29, 2021, 10:54 AM IST

Updated : Aug 29, 2021, 11:41 AM IST

National Sports Day

భారతదేశంలో ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని(National sports day) నిర్వహిస్తారు. ఈ వేడుకను రాష్ట్రీయ ఖేల్​ దివాస్​ అని కూడా పిలుస్తారు. అసలు ఈ క్రీడా దినోత్సాన్ని ఎందుకు జరుపుకొంటారో తెలుసుకుందాం.

ప్రపంచంలోని వివిధ దేశాలు ఆటల కోసం ఓ ప్రత్యేక రోజును కేటాయించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని (National sports day) జరుపుకుంటున్నాయి. అదే విధంగా భారత్​లోనూ జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆగస్టు 29న జరిగే నిర్వహించే ఈ వేడుకను రాష్ట్రీయ ఖేల్​ దివాస్​ అని కూడా పిలుస్తారు. ఈ రోజున దేశవ్యాప్తంగా క్రీడాకారులు ఎంతో ఉత్సాహంతో స్పోర్ట్స్​ డేలో పాల్గొంటారు. అసలు ఈ స్ట్పోర్ట్స్​ డేను ఎందుకు నిర్వహిస్తారు? ఈ వేడుకలను ఈరోజునే(ఆగస్టు 29) జరపడం వెనుక కారణమేంటో తెలుసుకుందాం.

క్రీడా దినోత్సవం ఎందుకంటే..

జీవితంలో క్రీడలు ముఖ్య పాత్ర పోషిస్తాయని భావితరాలకు అవగాహన పెంచే విధంగా.. క్రీడల ఆవశ్యకాన్ని తెలియపరిచే కార్యక్రమాలను నిర్వహించడమే దీని ప్రధాన లక్ష్యం. స్పోర్ట్స్​ డే సందర్భంగా నిర్వహించే వివిధ క్రీడా టోర్నీలు ఉత్తమ ప్రతిభను వెలికి తీయడానికి సహాయపడతాయి.

National Sports Day
ధ్యాన్​చంద్

ఆగస్టు 29.. దాని ప్రత్యేకత

అయితే జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఆగస్టు 29నే ప్రత్యేకంగా జరపడం వెనుక కారణం.. ధ్యాన్​చంద్. భారత హాకీ చరిత్రలో లెజెండరీ ఆటగాడిగా గుర్తింపు పొందిన ధ్యాన్​చంద్​.. మైదానంలో అడుపెడితే ఆయన్ని కట్టడి చేసేందుకు ప్రత్యర్థులు మల్లగుల్లాలు పడేవాళ్లు.

National Sports Day
ధ్యాన్​చంద్

1905 ఆగస్టు 29న ఉత్తరప్రదేశ్​లోని అలహాబాద్​కు చెందిన ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ధ్యాన్​చంద్​.. 1928, 32, 36లలో జరిగిన వరుస ఒలింపిక్స్​లలో భారత జట్టుకు స్వర్ణాలు సాధించి పెట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుతున్నారు. ధ్యాన్​చంద్​ ఆటకు ముగ్ధుడైన క్రికెట్​ దిగ్గజం సర్​ డాన్​ బ్రాడ్​మన్.. "క్రికెట్​లో బ్యాట్స్​మెన్ పరుగులు చేసినట్లు.. హాకీలో గోల్స్​ చేశాడు" అని కితాబు ఇచ్చారు.

జాతీయ క్రీడా దినోత్సవం ఎలా జరుపుకొంటారు?

దేశంలో ఉన్న విద్యాసంస్థలు, క్రీడా సంస్థలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఆగస్టు 29న ఘనంగా నిర్వహిస్తారు. పంజాబ్​, హరియాణా, ఉత్తర ప్రదేశ్​ రాష్ట్రాల్లో ఈ రోజును ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఎందుకంటే క్రీడాకారులు ఎక్కువగా ఆ రాష్ట్రాల నుంచి వచ్చిన వారే కావడం విశేషం.

ఈ ఏడాది.. క్రీడా పురస్కార వేడుక వాయిదా పడింది. గతేడాది కరోనా కారణంగా ఈ కార్యక్రమాన్ని వర్చువల్​గా నిర్వహించారు. ఈసారి పారాలింపిక్స్​ ​తర్వాత ఇరు విశ్వక్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పురస్కారాలతో సత్కరించనుంది.

ఇదీ చదవండి : Tokyo Paralympics: చరిత్ర సృష్టించిన భవీనా.. భారత్​కు తొలి పతకం

Last Updated :Aug 29, 2021, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.