IND VS AUS: తొలి టీ20లో ఆసీస్​దే విజయం

author img

By

Published : Sep 20, 2022, 10:36 PM IST

Updated : Sep 20, 2022, 10:48 PM IST

teamindia australia

తొలి టీ20లో టీమ్​ఇండియాపై విజయం సాధించింది ఆస్ట్రేలియా. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఉత్కంఠగా సాగిన తొలి టీ20లో టీమ్​ఇండియాపై విజయం సాధించింది ఆస్ట్రేలియా. భారత జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. జట్టు సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది. కెమరూన్​ గ్రీన్​(61) టాప్ స్కోర్. స్మిత్​ (35) పర్వాలేదనిపించగా..​ చివర్లో మ్యాథ్యూ వేడ్(45)​ బాగా రాణించాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్​ 3, ఉమేశ్​ యాదవ్​ 2, చాహల్​ ఓ వికెట్ తీశారు.

అంతకుముందు బ్యాటింగ్ దిగిన భారత బ్యాటర్లు బాగానే ఆడారు. నిర్ణీత 20ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. దీంతో ఆసీస్​కు 209 నిర్దేశించింది. హార్దిక్ పాండ్య(71*), కేఎల్ రాహుల్​(55) అర్ధశతకాలు సాధించారు. సూర్యకుమార్ యాదవ్​(46) రాణించాడు. ఆసీస్​ బౌరల్లలో నాథన్​ ఎల్లిస్​ 3, హేజిల్​వుడ్​ 2, గ్రీన్​ ఓ వికెట్​ తీశారు.

ఇదీ చూడండి: ఆ షాట్​ కొట్టి ఔటైతే చాలా బాధగా ఉంటుంది: కోహ్లీ

Last Updated :Sep 20, 2022, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.