IND VS PAK: పాక్​ జట్టుపై కోహ్లీ సరికొత్త రికార్డ్​

author img

By

Published : Oct 25, 2021, 8:28 AM IST

T20 World Cup 2021

విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. టీ20ల్లో (T20 World Cup 2021) పాక్​పై అత్యధికంగా 500 పరుగులు చేసిన అటగాడిగా నిలిచాడు. ఆదివారం పాక్​తో మ్యాచ్​లో గేల్ పేరిట ఉన్న రికార్డు​ను అధిగమించాడు.

ఐసీసీ టీ20 క్రికెట్​లో టీమ్​ఇండియా (T20 World Cup 2021) కెప్టెన్ విరాట్​ కోహ్లీ మరో మైలురాయిని దాటాడు. ఈ ఫార్మాట్​లో పాక్​పై 500 పరుగులు చేసిన భారత తొలి ఆటగాడిగా ఘనత సాధించాడు. ఈ మార్క్​ను అందుకోవడానికి 20 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆదివారం మ్యాచ్​లో హసన్​ అలీ బౌలింగ్​లో ఫోర్​ బాది దీనిని చేరాడు.

హాఫ్ సెంచరీల్లో..

టీ20 వరల్డ్​కప్​లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రికార్డ్ క్రిస్​ గేల్ పేరున ఉంది. ఆదివారం జరిగిన మ్యాచ్​లో కోహ్లీ దాన్ని అధిగమించాడు. ఈ ఫార్మాట్​లో పది హాఫ్ సెంచరీలు చేసిన ఘనత సాధించాడు. గేల్ తొమ్మిది హాఫ్​ సెంచరీలతో ఉన్నాడు. టీమ్​ఇండియాలో కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ ఏడు హాఫ్ సెంచరీలతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.

మ్యాచ్​ విశేషాలు..

ఆదివారం సాయంత్రం దుబాయ్​లో జరిగిన మ్యాచ్​లో తొలుత టీమ్​ఇండియా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. కోహ్లీ(57), పంత్(39) మినహా మిగిలిన బ్యాట్స్​మెన్ విఫలమయ్యారు.

ఛేదనలో ఆకట్టుకునే బ్యాటింగ్ చేసిన పాక్.. వికెట్ కోల్పోకుండానే లక్ష్యాన్ని పూర్తి చేసింది. మహమ్మద్ రిజ్వాన్ (79), బాబర్ ఆజామ్(68) అద్భుతంగా ఆడారు. ప్లేయర్​ ఆఫ్ ది మ్యాచ్​గా షహీన్ అఫ్రిది నిలిచాడు.

ఇదీ చదవండి: IND vs PAK: ఎంత ఎదురుచూసినా.. ఈసారి ఏ మాయ జరగలేదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.