7 ఏళ్ల వయసులో అనుకున్నాడు.. 21 ఏళ్లకు తీరింది.. రజనీతో సంజూ శాంసన్​

author img

By

Published : Mar 13, 2023, 1:47 PM IST

Sanju Samson Post On Rajinikanth Meeting

టీమ్​ఇండియా క్రికెటర్​ సంజూ శాంసన్ 21 సంవత్సరాల తన చిరకాల కోరికను 28 ఏళ్ల వయసులో తీర్చుకున్నాడు. తమిళ సూపర్​స్టార్​ రజనీకాంత్​ను తన నివాసంలోనే కలవాలన్న కల​ను ఈ నెల 12న సాకారం చేసుకున్నాడు.

టీమ్​ఇండియా క్రికెటర్​, రాజస్థాన్​ రాయల్స్​ కెప్టెన్​ సంజూ శాంసన్​ తన చిరకాల కోరికను ఈ నెల 12న తీర్చుకున్నాడు. తాను 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అనుకున్న దానిని సుదీర్ఘ కాలం తర్వాత అంటే 21 సంవత్సరాల తర్వాత 28 ఏళ్ల వయసులో తీర్చుకున్నాడు. అయితే సంజూ తన చిన్నతనంలోనే తలైవా రజనీకాంత్​ను ఎప్పటికైనా ఆయన నివాసంలోనే కలుసుకుంటానని తల్లిదండ్రులకు మాట ఇచ్చాడు.

ఇది తెలుసుకున్న రజనీకాంత్​ సంజూ శాంసన్​ను తన స్వగృహానికి రావాల్సిందిగా ఆహ్వానం పంపారట. దీంతో తలైవా పిలుపును అందుకున్న సంజూ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఎందుకంటే తన 21 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుందన్న సంతోషంలో మార్చి 12న చెన్నైలోని సూపర్​స్టార్​ నివాసానికి చేరుకున్నాడు. అక్కడ కొద్దిసేపు శాంసన్​తో మాట్లాడిన రజనీ.. అతడిని శాలువతో సత్కరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సంజూ స్వయంగా ట్విట్టర్​లో పోస్ట్​ చేసి తన అభిమానులతో అనందాన్ని పంచుకున్నాడు.

"నా 7 ఏళ్ల వయసు నుంచే సూపర్​స్టార్​ రజనీకాంత్​కి నేను వీరాభిమానిని. ఓ రోజు మా పేరెంట్స్​తో అన్నాను.. చూడండి ఓ రోజు ఎలాగైనా నేను రజనీ సార్​ ఇంటికి వెళ్లి మరీ కలుస్తాను అని. ఇక 21 ఏళ్ల తర్వాత తలైవా ఆహ్వానంతో ఆ రోజు రానే వచ్చింది."- సంజూ శాంసన్​

కేరళలో పుట్టిన సంజూ శాంసన్​కు చిన్నతనం నుంచే రజనీకాంత్​ అంటే ఎంతో ఇష్టం. ఈ విషయాన్ని గతంలో చాలా సార్లు స్వయంగా సంజూయే మీడియాతో తెలిపాడు. ఇకపోతే కరోనా లాక్‌డౌన్‌ సమయంలో కూడా సంజూ ఎక్కువగా ధ్యానం చేయడం, పుస్తకాలు చదవడంతో పాటు తాను ఎంతగానో అభిమానించే రజినీకాంత్​ సినిమాలు, మలయాళ సినిమాలు చూసేవాడినని అతడే తెలిపాడు.

ఇకపోతే సంజూ శాంసన్‌ ఇటీవలీ కాలంలో భారత జట్టులోకి తరుచూ వస్తూ వెళ్తూ ఉన్నాడు. అనేక కారణాలతో సంజూకు టీమ్​లో సుస్థిరమైన స్థానం ఇవ్వడం లేదు సెలక్టర్లు. కాకపోతే రాజస్థాన్​ రాయల్స్​ తరఫున ఆడుతున్న ఐపీఎల్​లో మాత్రం గొప్పు ఆటతీరును కనబరుస్తున్నాడు సంజూ. ఈ ఏడాది జరగబోయే ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో కూడా రాజస్థాన్​ టీమ్​కి సారథిగా వ్యవహరించనున్నాడు శాంసన్. ఇతడి సారథ్యంలోనే గతేడాది ఐపీఎల్​ సీజన్​లో రాజస్థాన్​ జట్టు రన్నరప్ స్థానంలో నిలిచింది. ఇక అంతర్జాతీయ స్టార్​ ఆటగాళ్లతో కూడిన ఈ జట్టు.. ఏప్రిల్​ 2న హైదరాబాద్​లోని రాజీవ్​ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగబోయే తన మొదటి మ్యాచ్​ను సన్​రైజర్స్​ హైదరాబాద్​తో ఆడనుంది​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.