టీమ్​ఇండియా కీలక పదవిలో సచిన్.. జై షా రిక్వెస్ట్!

author img

By

Published : Jan 12, 2022, 5:39 AM IST

sachin

sachin jay shah: రాహుల్ ద్రవిడ్, వీవీఎస్​ లక్ష్మణ్ సహా పలువురు మాజీ దిగ్గజాలు ఇప్పటికే టీమ్​ఇండియాకు సేవలందిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి సచిన్​ కూడా చేరనున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం బీసీసీఐ సెక్రటరీ జై షా.. సచిన్​ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

sachin jay shah: భవిష్యత్తులో టీమ్​ఇండియాలో కీలక బాధ్యతలు స్వీకరించాలని లిటిల్ మాస్టర్ సచిన్​ తెందూల్కర్​ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కార్యదర్శి జై షా కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​ జట్టుకు మెంటార్​గా ఉన్న సచిన్.. భారత జట్టు అభివృద్ధి కోసం కూడా పనిచేయనున్నాడని ఇటీవల వార్తలు విస్తృతమయ్యాయి. ఈ నేపథ్యంలో జై షా ప్రయత్నానికి ప్రాధాన్యం ఏర్పడిందని బీసీసీఐ వర్గాలు చెప్పాయి.

"ఏది సరైన విషయమో జై షాకు బాగా తెలుసు. రాహుల్​ ద్రవిడ్​ను హెడ్​ కోచ్​గా, వీవీఎస్ లక్ష్మణ్​ను ఎన్​సీఏ అధ్యక్షుడిగా నియమించడంలో జై షా కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం సచిన్​ను కూడా ఒప్పించేందుకు ఆయన పలు ప్రయత్నాలు చేస్తున్నారని మాకు తెలిసింది. భవిష్యత్తులో సచిన్​ టీమ్​ఇండియాలో కీలక పదవిని స్వీకరించవచ్చు." అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.

మాజీ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, వీవీఎస్​ లక్ష్మణ్ ఇప్పటికే భారత జట్టుకు సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సచిన్​ కూడా కీలక పదవి స్వీకరించాలని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

అంతర్జాతీయ క్రికెట్​లో 34 వేలకు పైగా పరుగులు చేసిన సచిన్.. అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా నిలిచి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.

ఇదీ చూడండి:

కోహ్లీ ఒంటరి పోరాటం.. భారత్ 223 ఆలౌట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.