'అలా ఆడతానని అనుకోలేదు.. నేనే సర్​ప్రైజ్ అయ్యా'.. రెండో టీ20 ప్రదర్శనపై రోహిత్

author img

By

Published : Sep 24, 2022, 2:22 PM IST

india australia t20 series

India Australia T20 Series : ఆస్ట్రేలియాతో మూడు టీ20 సిరీస్​లో భాగంగా నాగ్​పుర్ వేదికగా జరిగిన మ్యాచ్​లో భారత్​ విజయం సాధించింది. ప్రతికూల పరిస్థితుల కారణంగా మ్యాచ్​ను 8 ఓవర్లకు కుదించగా.. కంగారూలు విధించిన 91 పరుగుల లక్ష్యన్ని భారత్ ఛేదించింది. దీనిపై ఇరు జట్ల కెప్టెన్లు స్పందించారు. ఏమన్నారంటే..

India Australia T20 Series : మెగా టోర్నీ ముందు టీమ్​ ఇండియా ఆసీస్​తో మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​ ఆడుతోంది. మొదటి మ్యాచ్​ ఆస్ట్రేలియా గెలిచింది. అయితే మైదానం తడిగా ఉండటం వల్ల రెండో మ్యాచ్​ను 8 ఒవర్లకు కుదించారు. ఈ మ్యాచ్​లో అద్భుత ప్రదర్సనతో ఘన విజయం సాధించింది టీమ్​ ఇండియా. టాస్​ గెలిచి ఫీల్డంగ్ ఎంచుకున్న టీమ్​ ఇండియా.. 5 వికెట్లు తీసి 90 పరుగులు ఇచ్చింది. 91 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన.. రోహిత్​ సేన.. మధ్యలో తడబడ్డా సునాయసంగా గెలిచింది.

ఈ విజయం పట్ల విమర్శకులు ఎలా ఉన్నా.. టీమ్​ ఇండియా అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. సెప్టెంబర్​ 25న హైదరాబాద్​లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సిరిలో ఆఖరి మ్యాచ్​ జరగనుంది. చెరో మ్యాచ్​ గెలిచి సమంగా ఉన్న భారత్​-ఆస్ట్రేలియా.. డిసైడర్​ మ్యాచ్​లో హోరాహోరీగా తలపడనున్నాయి. అయితే శుక్రవారం జరిగిన చిట్టి మ్యాచ్​ గురించి రోహిత్ శర్మ, ఫించ్​ ఏమన్నారంటే..

రోహిత్ శర్మ తన బ్యాటింగ్ గురించి స్పందిస్తూ.. "నేనూ సర్​ప్రైజ్​ అయ్యాను. నేను అలా ఆడతానని నుకోలేదు.. కానీ బాగానే అడాను. గత 8-9 నెలల నుంచి నేను అలాగే ఆడుతున్నాను. అయితే ఇలాంటి చిన్న మ్యాచ్​లో ఎక్కువ ప్లాన్​ ఏమీ చేయలేము. అయితే ఈ మ్యాచ్​లో బౌలింగ్​ చాలా బాగా వేశాం. హర్షల్ బౌలింగ్​పై నేను కామెంట్​ చేయదలచుకోలేదు. ఒక జట్టుగా మేము ఆ విషయాన్ని అంతగా విశ్లేషించము. అతడు మంచిగా ఆడలని కోరుకుంటాము. అతడు బ్యాటింగ్ కూడా చేయాలని ఆశిస్తున్నా" అని చెప్పుకొచ్చాడు.

అయితే, అక్షర్​ పటేల్​ మంచి ప్రదర్శన చేశాడని రోహిత్ కొనియాడాడు. "అతడు ఏ స్టేజ్​లోనైనా అడగలడు. దీంతో నేను ఏ పరిస్థితుల్లో ఏ బౌలర్​ను ఉపయోగించుకోవాలో సులువు అవుతుంది. దినేశ్ కార్తీక్ కూడా మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. చాలా కాలం తర్వాత అతడు మిడిల్​లో బ్యాటింగ్ చేశాడు. అయితే మొదటగా రిషబ్​ పంత్​ను పంపించాలనుకున్నాం. కానీ అప్పుడు సామ్ బౌలింగ్​కు వచ్చాడు. దాంతో దినేశ్​ను పంపించాం" అని రోహిత్ శర్మ వివరించాడు.

ఆ రెండు ఓవర్లు మ్యాచ్​ను మర్చేశాయి..
మ్యాచ్​పై అరోన్​ ఫించ్​ స్పందిస్తూ.." నిజానికి మనం 5 ఓవర్లకు ప్లాన్​ చేస్తాం. కానీ ఇది అంతకంటే కొంచెం ఎక్కువ. రోహిత్​ చాలా అద్భుతంగా ఆడాడు. అక్షర్​ పటేల్​ వేసిన ఆ రెండు ఓవర్ల మ్యాచ్​లో డిఫరెన్స్ తీసుకొచ్చాయి. వేడ్​ కూడా మా తరఫున మంచి ఫినిష్​ ఇచ్చాడు. జంపా కూడా మంచి బౌలింగ్ వేశాడు" అని తెలిపాడు.

బుమ్రా.. బ్యాక్​..
గాయం కారణంగా మొదటి మ్యాచ్​ ఆడకపోయినా.. రెండో మ్యాచ్​లో ఎంట్రీ ఇచ్చాడు ఫాస్ట్​ బౌలర్ జస్​ప్రీత్​ బుమ్రా. పర్ఫెక్ట్ యార్కర్​తో ఆరోన్ ఫించ్​ను క్లీన్​ బౌల్డ్​ చేశాడు. దీంతో జట్టు బౌలింగ్​లో కొంచెం బలం పెరిగింది. ​

ఇవీ చదవండి: మాస్టర్‌ బ్లాస్టర్‌ మెరుపు సిక్స్​.. అభిమానులు ఫిదా

ఇంకా తేలని టికెట్ల లెక్క.. స్టేడియం కుర్చీలపై పిట్టల రెట్ట.. మ్యాచ్ నిర్వహణ ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.