'పాక్​ చేసిన తప్పే బీసీసీఐ చేస్తోంది.. అలాంటి కెప్టెన్లు కావాలి'

author img

By

Published : Aug 1, 2022, 8:03 PM IST

rashid latif on indian captaincy

Rashid latif on india captain change: 1990లో పాకిస్థాన్​ ఇలానే నాయకులను మార్చి తప్పు చేసిందని.. భారత్​ కూడా ఇప్పుడు అదే తప్పు చేస్తోందన్నాడు పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్. తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన.. లతీఫ్ ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Rashid latif on india captain change: భారత జట్టుపై పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. 1990లో పాకిస్థాన్​ ఇలానే నాయకులను మార్చి తప్పు చేసిందని.. భారత్​ కూడా ఇప్పుడు అదే తప్పు చేస్తోందన్నాడు. భారత్​కు ఇప్పుడు గంగూలీ, ధోనీ, కోహ్లీ లాంటి నాయకులు కావాలని అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన.. లతీఫ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

"ప్రస్తుతం అందరూ బ్యాకప్ కెప్టెన్‌లు గురించి మాట్లాడుతున్నారు. కానీ భారత్‌ మాత్రం గత ఏడాది నుంచి ఏకంగా ఏడుగురు సారథిలను మార్చింది. భారత క్రికెట్‌ చరిత్రలో నేను ఈ పరిస్థితిని చూడటం ఇదే మొదటిసారి. టీమ్​ఇండియా వరుసగా విరాట్‌ కోహ్లి, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి వారిని వివిధ సిరీస్‌లకు తమ సారథిలుగా నియమించింది. అది జట్టుకు మంచిది కాదు. ప్రస్తుతం భారత జట్టు తీరు చూస్తుంటే టీమ్​ఇండియా సైతం 1990లలో పాకిస్థాన్ చేసిన తప్పే చేస్తున్నట్టుంది. భారత్​కు నిలకడగల ఓపెనర్, మిడిల్​ ఆర్డర్​​ దొరకలేదు. వారికి ఓ కొత్త కెప్టెన్​ కావాలి. ఏ కెప్టెన్​ కూడా నిలకడగా రాణించడం లేదు. కేఎల్​ రాహుల్​, రోహిత్​ శర్మ ఫిట్​గా లేరు. విరాట్ కోహ్లీ మానసికంగా సిద్ధంగా లేడు. చాలా మంది కెప్టెన్లను మారుస్తున్నారు. భారత్​కు ఇప్పుడు సౌరభ్ గంగూలీ, ఎమ్​ఎస్​ ధోనీ, విరాట్ కోహ్లీ లాంటి కెప్టెన్ కావాలి."

- రషీద్​ లతీఫ్​, పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​

తాజాగా జింబాబ్వేతో వన్డే సిరీస్​కు జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఆగస్టు 18న ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు ధావన్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఇప్పటివరకు విరాట్‌ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, శిఖర్‌ ధావన్‌ భారత్‌కు సారథిలుగా పనిచేశారుకాగా గత 8 నెలల నుంచి భారత జట్టుకు ఇప్పటి వరకు ఏడుగురు కెప్టెన్‌లుగా వ్యవహారించారు. రెగ్యులర్​ కెప్టెన్​ రోహిత్​శర్మకు విశ్రాంతిని ఇవ్వడం వల్ల జూన్​లో జరిగిన ఐర్లాండ్​, దక్షిణాఫ్రికా సిరీస్​లకు.. రిషబ్​ పంత్​, బుమ్రా, హార్దిక్ పాండ్య కెప్టెన్లుగా వ్యవహరించారు.

ఇవీ చదవండి: Commonwealth games: ఆ అన్న త్యాగం.. తమ్ముడికి స్వర్ణం

'గోల్డ్​ గెలిచేశావ్​గా.. ఇప్పుడు దర్జాగా సినిమా చూసుకో అచింత!'.. మోదీ ట్వీట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.