IPL 2021 News: 'డివిలియర్స్​ను ఆర్సీబీ వదులుకోవాలి'

author img

By

Published : Oct 13, 2021, 2:18 PM IST

AB de villiers

వచ్చే ఏడాది ఐపీఎల్​(IPl 2022 news)లో భాగంగా.. రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఏబీ డివిలియర్స్​ను వదులుకోవాల్సిందే అని టీమ్​ఇండియా మాజీ బ్యాట్స్​మన్ గౌతమ్ గంభీర్(Gambhir on RCB) అభిప్రాయపడ్డాడు. జట్టు భవిష్యత్తును మ్యాక్స్​వెల్​ నిర్దేశిస్తాడని సూచించాడు.

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఫ్రాంచైజీ ఏబీ డివిలియర్స్​ను(AB De Villiers News) వచ్చే ఏడాది కూడా తమ జట్టుతోనే అట్టిపెట్టుకోకూడదని అభిప్రాయపడ్డాడు టీమ్​ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్(Gambhir on RCB). ఈ సీజన్​లో జట్టు తరఫున అత్యధిక స్కోరు చేసిన గ్లెన్​ మ్యాక్స్​వెల్​ను(Gambhir on Maxwell) కొనసాగించాలని సూచించాడు.

"ఆర్సీబీ జట్టులో రానున్న రోజుల్లో మరింత రాణించే ఆటగాడు డివిలియర్స్​ కాదు. ఇది మ్యాక్స్​వెల్​తో సాధ్యమవుతుంది" అని గంభీర్​ తెలిపాడు.

దక్షిణాఫ్రికా మాజీ సారథి ఏబీ డివిలియర్స్(AB De Villiers RCB)​ 2011 నుంచి ఆర్సీబీకి ఆడుతున్నాడు. ఐపీఎల్​లో ఇప్పటివరకు అతడు 184 మ్యాచ్​లు ఆడి 5162 పరగులు చేశాడు. ఈ సీజన్​లో మాత్రం 313 పరుగులే చేశాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు చెప్పిన అనంతరం డివిలియర్స్ టీ20 టోర్నీలు ఆడిన సందర్భాలు చాలా తక్కువ. ఈ నేపథ్యంలో గంభీర్​ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

మెగావేలానికి ముందు.. మ్యాక్స్​వెల్​, కోహ్లీ, యుజ్వేంద్ర చాహల్​ను ఆర్సీబీ తమతోనే అంటిపెట్టుకోవాలని గంభీర్​ సూచించాడు.

ఇదీ చదవండి:

'అవకాశం ఇస్తే కొత్త జట్టుకు కెప్టెన్​గా ఉంటా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.