పడిక్కల్, కోహ్లీ మెరుపులు.. చెన్నై లక్ష్యం 157

author img

By

Published : Sep 24, 2021, 9:23 PM IST

IPL news

చెన్నై సూపర్ కింగ్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్​మెన్ పర్వాలేదనిపించారు. నిర్ణీత 20 ఓవర్లలో 156 పరుగులు చేసింది ఆర్సీబీ. పడిక్కల్ (70), కోహ్లీ (53) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు.

ఐపీఎల్ 2021లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పర్వాలేదనిపించింది. ముందుగా ఓపెనర్లు కోహ్లీ, పడిక్కల్​ బౌండరీలు బాదడమే లక్ష్యంగా ఆడారు. దీంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరి దాటికి తొలి పవర్​ప్లేలో 55 పరుగులు సాధించింది ఆర్సీబీ. ఆ తర్వాత కూడా వీరిద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదారు. దీంతో 11 ఓవర్లలోనే స్కోర్ 100కు చేరింది. ఈ క్రమంలోనే కోహ్లీ ఐపీఎల్​లో 41వ, పడిక్కల్ 6వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. కానీ కాసేపటికే కోహ్లీ (53) బ్రావో బౌలింగ్​లో బౌండరీ వద్ద క్యాచ్​ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా తొలి వికెట్​కు 111 పరుగుల వద్ద బ్రేక్ పడింది. సీఎస్కేపై ఆర్సీబీ ఓపెనర్లకు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం గమనార్హం.

ఆ తర్వాత వచ్చిన డివిలియర్స్ (12) శార్దుల్ ఠాకూల్ బౌలింగ్​లో భారీ సిక్సు బాది ఊపు మీద కనిపించాడు. కానీ తర్వాత బంతికే భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్​గా వెనుదిగిరిగాడు. అనంతరం పడిక్కల్​(70)ను కూడా బోల్తా కొట్టించాడు శార్దూల్. దీంతో స్కోర్ బోర్డ్ నెమ్మదించింది. చివర్లో ఆదుకుంటారనుకున్న మ్యాక్స్​వెల్ (11), టిమ్ డేవిడ్ (1) కూడా విఫలమయ్యారు. ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులకు పరిమితమైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.