ఐపీఎల్​ 2022 కోసం ప్లాన్​ బి.. వేదిక ఎక్కడంటే?

author img

By

Published : Jan 13, 2022, 2:51 PM IST

ipl 2022

IPL 2022 Venue: దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి ఐపీఎల్​ను దక్షిణాఫ్రికా లేదా శ్రీలంకలో నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. మొదట్లో ఐపీఎల్‌ను స్వదేశంలోనే నిర్వహించాలని భావించినా.. ఒమిక్రాన్​ వ్యాప్తి దృష్ట్యా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు వెల్లడించారు.

IPL 2022 Venue: దేశంలో కొవిడ్-19 కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ 2022 వేదిక గురించి సందిగ్ధత నెలకొంది. తొలుత ఈ సీజన్​ను స్వదేశంలో నిర్వహించాలని భావించినా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. అందుకే ఈ మెగాలీగ్ వేదిక విషయంలో ప్లాన్​ బీని అమలు చేయాలని భావిస్తున్నట్లు ఓ బోర్డు అధికారి తెలిపారు. ఈ సారి దక్షిణాఫ్రికా లేదా శ్రీలంకలో మెగాలీగ్​ను నిర్వహించాలని బీసీసీఐ కసరత్తులు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

"మనం ప్రతిసారి ఐపీఎల్​ను యూఏఈలో నిర్వహించడం కుదరకపోవచ్చు. అందుకే మరిన్ని అవకాశాల కోసం చూస్తున్నాం. దక్షిణాఫ్రికాలో స్థానిక కాలమానం మార్పు కూడా ప్లేయర్స్​కు ఉపయోగకరంగా ఉంటుంది." అని బీసీసీఐ అధికారి తెలిపారు.

ఈ సీజన్​లో ఇప్పటికే ఉన్న జట్లతో పాటు మరో రెండు కొత్త టీమ్స్​ కూడా బరిలో దిగబోతున్నాయి. దీంతో టోర్నీ​ మరింత ఆసక్తికరంగా మారనుంది. ఇప్పటికే మెగావేలం నిర్వహణ కోసం పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 12,13 తేదీల్లో ఈ వేలం ప్రక్రియ జరగనుంది.

ఇదీ చూడండి: కొత్త ఫ్రాంఛైజీలకు డెడ్​లైన్.. వేలానికి ముందే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.