IND Vs SA: 'కోహ్లీ బ్యాటింగ్ తీరు​పై ఆందోళనే లేదు'

author img

By

Published : Jan 12, 2022, 9:55 AM IST

Virat Kohli

IND Vs SA: టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఆటతీరుపై తాము ఎప్పుడూ ఆందోళన చెందలేదని భారతజట్టు బ్యాటింగ్​ కోచ్ విక్రమ్ రాఠోడ్ స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో విరాట్,​ తన ఫామ్​ లేమిని అధిగమించి 79 పరుగులు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు​.

IND Vs SA: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ 79 పరుగులు చేయడంపై టీమ్​ఇండియా బ్యాటింగ్ కోచ్​ విక్రమ్ రాఠోడ్ స్పందించాడు. కోహ్లీ బ్యాటింగ్​పై తమకు ఎప్పుడూ ఆందోళన కలగలేదని అన్నాడు. బ్యాటింగ్ కోచ్​గా తనకు.. విరాట్​ మెరగ్గా ఆడటం లేదన్న సందేహం ఏనాడూ కలగలేదని తెలిపాడు. విరాట్​ ఫామ్​ లేమిని అధిగమించి 79 పరుగులు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.

"కోహ్లీ షాట్​ సెలక్షన్​ గతంలో కంటే చాలా మెరుగు పడింది. సరైన ఏకాగ్రత లేకపోవడం కారణంగానే తొలి టెస్టులో విఫలమయ్యాడు. మొదట్లో దక్షిణాఫ్రికా బౌలర్లు కోహ్లీకు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. కోహ్లీ నుంచి పరుగులు రాకుండా కట్టడి చేశారు. అయితే ఈ మ్యాచ్​ను కోహ్లీ చాలా ఏకాగ్రతతో ఆడాడు. అతడు సరైన బంతులను ఎంచుకున్నాడు" అని టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్​ విక్రమ్ రాఠోడ్ స్పష్టం చేశాడు. బ్యాటింగ్​ ఎంచుకున్న టీమ్​ఇండియా.. మూడోటెస్టులో మరింత మెరుగ్గా ఆడాల్సిందన్నాడు రాఠోడ్.

దక్షిణాఫ్రికాతో మూడోటెస్టులో సారథి కోహ్లీ 79పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో 71వ శతకాన్ని మిస్ చేసుకున్నాడు. రబాడా బౌలింగ్​లో వికెట్ కీపర్​ వెరీన్​కు చిక్కి 9వ వికెట్​గా నిష్క్రమించాడు.

దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా 223 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్​ విరాట్​ కోహ్లీ(79;201 బంతుల్లో 12x4,1x6) టాప్ స్కోరర్​గా నిలిచాడు. పుజారా 77 బంతుల్లో 43 పరుగులు చేశాడు.

ఇదీ చూడండి: IND Vs SA: కోహ్లీ మరో రికార్డు.. సచిన్ తర్వాత రెండో స్థానంలో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.