ఐపీఎల్ 2020​: వివోతో బీసీసీఐ ఒప్పందం రద్దు

author img

By

Published : Aug 6, 2020, 4:58 PM IST

Updated : Aug 6, 2020, 5:06 PM IST

Vivo will not be IPL title sponsors this year: BCCI

రానున్న ఐపీఎల్​ టైటిల్​ స్పాన్సర్​షిప్​ విషయంలో వివోతో తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది బీసీసీఐ. త్వరలోనే కొత్త టెండర్ల ప్రక్రియను మొదలు పెడతామని తెలిపింది.

చైనా స్మార్ట్​ఫోన్​ కంపెనీ వివోతో ఐపీఎల్-2020​ టైటిల్​ స్పాన్సర్​షిప్​ను రద్దు చేసుకుంది బీసీసీఐ. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. భారత్​-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

"ఐపీఎల్​ 2020లో వివోతో తమ భాగస్వామ్యాన్ని రద్దు చేసుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది."

-బీసీసీఐ ప్రకటన.

2018 నుంచి ఐదేళ్ల(2022) పాటు ఐపీఎల్​ టైటిల్​ స్పాన్సర్​షిప్​ను సొంతం చేసుకుంది వివో. ఇందుకోసం రూ.2190 కోట్లను వెచ్చించింది. అంటే ఏడాదికి రూ.440 కోట్లు.

టైటిల్​ స్పాన్సర్ల కోసం బీసీసీఐ త్వరలోనే టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టే అవకాశముంది.

వేసవి కాలంలో జరగాల్సిన ఐపీఎల్​ 2020​.. యూఏఈ వేదికగా సెప్టెంబర్​ 19నుంచి ప్రారంభంకానుంది. టోర్నీ కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇదీ చూడండి:- ఐపీఎల్​లో ఒక్కో జట్టుకు ఒక్కో చోట వసతి

Last Updated :Aug 6, 2020, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.