పెరుగుతున్న కేసులు.. బ్యాడ్మింటన్​ టోర్నీలు రద్దు

author img

By

Published : Aug 11, 2021, 5:36 PM IST

Korea Open, Macau Open cancelled

ప్రధాన బ్యాడ్మింటన్​ టోర్నీలపై కరోనా ఇంకా ప్రభావం చూపిస్తూనే ఉంది. కొవిడ్​ మహమ్మారి నేపథ్యంలో.. రెండు ప్రధాన టోర్నమెంట్లను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్​ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్​) ప్రకటించింది.

కరోనా కేసుల పెరుగుదల కారణంగా.. ప్రపంచ బ్యాడ్మింటన్​ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్​) కీలక నిర్ణయం తీసుకుంది. కొరియా ఓపెన్​, మకావు ఓపెన్​ టోర్నీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. చైనాలో జరగాల్సిన ప్రపంచ జూనియర్​ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​నూ వాయిదా వేసింది.

కొరియా ఓపెన్​​ ఆగస్టు 31- సెప్టెంబర్​ 5 వరకు, మకావు ఓపెన్​.. నవంబర్​ 2 నుంచి 7 మధ్య జరగాల్సి ఉంది. కానీ.. ఇప్పుడు ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని రద్దు చేయడమే మేలనే అభిప్రాయం వ్యక్తం చేసింది బీడబ్ల్యూఎఫ్​. ఈ ఏడాది జరగాల్సిన మిగతా టోర్నీలు గురించి చర్చించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే వాయిదా పడిన మలేసియా మాస్టర్స్​ సూపర్​ 500 ఈవెంట్​, మలేసియా ఓపెన్​ సూపర్​ 750 టోర్నీల విషయమై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపింది.

కొవిడ్​ మహమ్మారి కారణంగా.. చైనా ఓపెన్, జపాన్​ ఓపెన్​, హాంకాంగ్​ ఓపెన్​ సహా ఇతర ప్రధాన టోర్నీలు ఇదివరకే రద్దయ్యాయి. ఈ కారణంగా.. సైనా నెహ్వాల్​, కిదాంబి శ్రీకాంత్​ వంటి భారత షట్లర్లు టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించలేకపోయారు.

ఇవీ చూడండి:

20 బ్రాండ్లపై పీవీ సింధు దావా! కారణమేంటి?

ఇలా అయితే ఎక్కువ పతకాలు ఎలా వస్తాయి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.