అటు హీరోలుగా, ఇటు నిర్మాతలుగా.. రెండింట్లోనూ హిట్టే!

author img

By

Published : Nov 8, 2021, 11:18 AM IST

mahesh babu, ram charan, kalyan ram

తెరపై అలరించి, ప్రేక్షకుల మనసు దోచేస్తున్న పలువురు నటులు నిర్మాతలుగానూ హిట్​ అవుతున్నారు. సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి భారీ బడ్జెట్​ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు టాలీవుడ్, బాలీవుడ్ నటుల ప్రొడక్షన్​ సంస్థల గురించి తెలుసుకుందాం..

వెండితెరపై అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసును కొల్లగొడుతుంటారు నటీనటులు. వీరి సినిమాలకు తగినన్ని నిధులు సమకూర్చే పనిలో నిర్మాణ సంస్థలు ఉంటాయి. అయితే.. క్రమంగా ఈ ట్రెండ్​ మారుతోంది. నటీనటులే సొంతంగా నిర్మాణ సంస్థలను ఏర్పాటు చేసి భారీ బడ్జెట్​ సినిమాలు తెరకెక్కిస్తూ కెరీర్​లో విజయవంతమవుతున్నారు. తమ సంపాదననూ రెట్టింపు చేసుకుంటున్నారు. గతంలో ఈ మార్పు బాలీవుడ్​లో ఎక్కువగా ఉండేది. కానీ, ఇప్పుడు టాలీవుడ్​, కోలీవుడ్, మాలీవుడ్​లలోనూ ఈ మార్పులను చూస్తున్నాం.

టాలీవుడ్​ అగ్ర హీరోలు మహేశ్ బాబు, రామ్​ చరణ్​ సహా మంచు విష్ణు, కళ్యాణ్​ రామ్.. నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేసి పలు హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ టాలీవుడ్, బాలీవుడ్​ నటుల నిర్మాణ సంస్థల గురించి తెలుసుకుందాం..

టాలీవుడ్​లో వీరే..

ప్రముఖ నటుడు మహేశ్​ బాబు జీఎంబీ(జీ మహేశ్ బాబు ఎంటర్​టైన్​మెంట్)(GMB entertainment movies) ప్రొడక్షన్ సంస్థను 2014లో ఏర్పాటు చేశారు. మహేశ్​ నటించిన 'శ్రీమంతుడు', 'బ్రహ్మోత్సవం', 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాలు జీఎంబీ ఎంటర్​టైన్​మెంట్​ నిర్మాణ సంస్థలోనే తెరకెక్కాయి. ప్రస్తుతం 'మేజర్', 'సర్కారు వారి పాట' సినిమాలకూ జీఎంబీ సంస్థ నిర్మాతగా వ్యవహరిస్తోంది.

mahesh babu
మహేశ్ బాబు

ఇదే దారిలో రామ్​ చరణ్

టాలీవుడ్​ నటుడు, మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్​చరణ్.. కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థను(Konidela Productions company) ఏర్పాటు చేశారు. 'ఖైదీ నంబర్ 150', 'సైరా నర్సింహారెడ్డి' చిత్రాలను నిర్మించింది ఈ సంస్థే. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' సినిమాకూ నిర్మాతగా వ్యవహరిస్తోంది.

Ram charan
రామ్​చరణ్

మంచు విష్ణు

ఇటీవలే 'మా' అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు.. 2007లోనే '24 ఫ్రేమ్స్​ ఫ్యాక్టరీ'(24 frames factory movies) అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్​లో చాలా సినిమాలు తెరకెక్కాయి. అయితే.. గతంలోనే విష్ణు తండ్రి, ప్రముఖ నటుడు మోహన్​ బాబు శ్రీ లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్ హౌస్​ను ఏర్పాటు చేసి పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అదే దారిలో పయనిస్తున్నారు విష్ణు.

manchu vishnu
మంచు విష్ణు

కల్యాణ్ రామ్​

నందమూరి కల్యాణ్ రామ్ యన్​.టి.ఆర్ ఆర్ట్స్​ నిర్మాణ సంస్థను(NTR arts movies) ఏర్పాటు చేశారు. 'జై లవ కుశ' సహా పలు హిట్​ చిత్రాలు ఈ పతాకంపై తెరకెక్కాయి.

kalyan ram
కల్యాణ్ రామ్

కొత్త నటుల్లోనూ..

కొత్తగా వెండితెరకు పరిచయమై మంచి హిట్​ సినిమాల్లో నటించిన కొందరు టాలీవుడ్​ నటులు కూడా నిర్మాణ సంస్థలను ఏర్పాటు చేసే దిశగా అడుగులేస్తున్నారు. యువ నటుడు విజయ్ దేవరకొండ(vijay devarakonda production house) ఇప్పటికే ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

vijay devarakonda
విజయ్ దేవరకొండ

బాలీవుడ్​లో వీరే టాప్..

ప్రముఖ బాలీవుడ్ నటులు షారుక్​ ఖాన్, అక్షయ్ కుమార్, ఆమీర్ ఖాన్, ఫర్హాన్ అక్తర్, ప్రియాంకా చోప్రా, అనుష్క శర్మ సహా చాలా మంది నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేసి భారీ జడ్జెట్​ సినిమాలు తెరకెక్కించారు.

  • షారుక్ ఖాన్- రెడ్​ చిల్లీస్​ ఎంటర్​టైన్​మెంట్
  • అక్షయ్ కుమార్- హరి ఓం ఎంటర్​టైన్​మెంట్ కంపెనీ
  • ప్రియాంకా చోప్రా జోనస్- పర్పుల్ పెబల్ పిక్చర్స్
  • అజయ్ దేవ్​గణ్- అజయ్ దేవ్​గణ్ ఎఫ్​ ఫిల్మ్స్
  • ఆమీర్ ఖాన్- ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్స్
  • అనుష్క శర్మ- క్లీన్ స్లేట్ ఫిలింస్
  • సైఫ్ అలీ ఖాన్- ఇల్లుమినటి ఫిల్మ్స్
  • ఫర్హాన్ అక్తర్- ఎక్సెల్ ఎంటర్​టైన్​మెంట్
  • జాన్ అబ్రహం- జేఏ ఎంటర్​టైన్​మెంట్

ఇదీ చదవండి:

అమృత ప్రణయ్​తో లాస్య​ స్పెషల్​ సాంగ్​

'నాట్యం'కు అరుదైన గౌరవం.. చిత్రబృందం ఫుల్ హ్యాపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.