mahasamudram movie: శర్వా కన్నా సిద్ధార్థ్​కు తక్కువే!

author img

By

Published : Jun 28, 2021, 3:24 PM IST

Maha Samudram

'మహాసముద్రం' సినిమా కోసం హీరోలు శర్వానంద్, సిద్ధార్థ్​ తీసుకున్న రెమ్యునరేషన్​ గురించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ వారి పారితోషికం ఎంతంటే?

టాలీవుడ్​ హీరో శర్వానంద్​, సిద్దార్థ్ నటిస్తున్న మల్టీస్టారర్ 'మహాసముద్రం'. 'ఆర్​ఎక్స్​ 100' ఫేమ్​ అజయ్​ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత సిద్ధార్థ్​​ తెలుగులో సినిమా చేయడం, దర్శకుడి తొలి సినిమా హిట్​ కావడం వల్ల ఈ మూవీపై సినీప్రియుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం జోరుగా ప్రచారం సాగుతోంది.

ఈ సినిమా కోసం శర్వానంద్​ రూ. 5కోట్లు, సిద్ధార్థ్​ రూ.3 కోట్లు రెమ్యునరేషన్​ తీసుకున్నట్లు తెలిసింది. అయితే శర్వా.. కరోనా వల్ల తన పారితోషికాన్ని ఇంకా తగ్గించుకున్నారట. లవ్​ అండ్​ యాక్షన్​ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో అదితి రావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్​ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ ద్విభాషా చిత్రాన్ని ఏకె ఎంటర్​టైన్​మెంట్​ బ్యానర్​పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

ఇదీ చూడండి: 'మహాసముద్రం' సాంగ్​కు నో చెప్పిన స్టార్ హీరోయిన్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.