ఓటీటీలో బాలయ్య కొత్త ప్రయోగం.. ఆధ్యాత్మిక కార్యక్రమంతో!

author img

By

Published : Nov 28, 2021, 1:53 PM IST

balakrishna akhanda

స్మాల్​ స్క్రీన్​పై మరింత సందడి చేసేందుకు బాలయ్య సిద్ధమవుతున్నారు. ఓటీటీలో హోస్ట్​గా చేస్తున్న ఆయన త్వరలో ఓ భక్తి ఛానెల్​ను ప్రారంభిద్దామని అనుకుంటున్నట్లు చెప్పారు. 'అఖండ' ప్రీ రిలీజ్ వేడుకలో ఈ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

నందమూరి బాలకృష్ణ 'అఖండ' ప్రీ రిలీజ్​ ఈవెంట్​.. హైదరాబాద్​లో శనివారం రాత్రి భారీస్థాయిలో జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు రాజమౌళి.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్​లో బాలయ్య మాట్లాడుతూ పలు షాకింగ్ కామెంట్స్ చేశారు. త్వరలో ఓ భక్తి ఛానెల్​ ప్రారంభిద్దామని అనుకుంటున్నట్లు చెప్పారు.

అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్​లో బాలయ్య స్పీచ్

"ఇది కార్తీకమాసం కాబట్టి అందరికీ శివపార్వతుల ఆశీస్సుల ఉండాలి. మనందరం అనుకునే ప్రతి మాట వెనుక ఓ పవర్​ ఉంటుంది. నవరసల్లానే మన పూజా విధానాలు కూడా తొమ్మిది రకాలని చెబుతుంటారు మన భక్తి టీవీల్లో. ఇక 'ఆహా' ఓటీటీలో యాంకరింగ్ చేస్తున్నట్లే.. త్వరలో ఓ భక్తి ఛానెల్​ కూడా స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను" అని బాలయ్య అన్నారు.

కరోనా సమయంలో పలువురు ప్రాణాలకు తెగించి షూటింగ్​లు చేశారని, వాళ్లు ఏం చేసినా సినిమా కోసమేనని బాలయ్య చెప్పారు. కష్టకాలంలో ఉన్న సినీ ఇండస్ట్రీని ఆదుకోవాలని ప్రభుత్వాలను కోరారు. రానున్న కాలంలో పుష్ప, ఆర్ఆర్ఆర్, ఆచార్య విడుదలవుతున్నాయని.. ఈ సినిమాలు మంచిగా ఆడేలా ప్రభుత్వాలు సహకరించాలని కోరుతున్నట్లు బాలయ్య వ్యాఖ్యానించారు.

balakrishna allu arjun
బాలయ్య అల్లు అర్జున్

'అఖండ' సినిమా డిసెంబరు 2న థియేటర్లలోకి రానుంది. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అఘోరా పాత్రలోనూ కనువిందు చేయనున్నారు. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్​ విలన్​గా చేశారు. జగపతిబాబు, పూర్ణ కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించగా, బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. రవీందర్ రెడ్డి నిర్మించారు.

balakrishna akhanda
అఖండ సినిమాలో బాలయ్య

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.