Maa elections 2021: 'మా' ఎన్నికల తుది ఫలితాలు ఇవే

author img

By

Published : Oct 11, 2021, 7:29 PM IST

Maa elections 2021 final result

ఎంతో ఆసక్తి రేకెత్తించి, చర్చనీయాంశమైన 'మా' ఎన్నికల పూర్తి ఫలితాలను ఎన్నికల అధికారి సోమవారం వెల్లడించారు. ఈ పోటీలో విష్ణు ప్యానెల్​లో 10, ప్రకాశ్​రాజ్ ప్యానెల్​లోని 8 మంది ఈసీ సభ్యలు విజయం సాధించారు.

'మా' ఎన్నికల తుది ఫలితాలు వచ్చేశాయి. ఎన్నికల అధికారి కృష్ణమోహన్​ వీటిని ప్రకటించారు. 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించారు. జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్​గా శ్రీకాంత్.. వైస్​ ప్రెసిడెంట్లుగా మాదాల రవి, బెనర్జీ.. జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్, గౌతమ్ రాజు.. కోశాధికారిగా శివబాలాజీ విజయం సాధించారు.

గెలిచిన ఈసీ సభ్యుల్లో శివారెడ్డి, గీతాసింగ్, అశోక్ కుమార్, బ్రహ్మాజీ, శ్రీలక్ష్మి, మాణిక్, ప్రభాకర్, తనీష్, హరినాథ్ బాబు, సురేష్ కొండేటి, శివన్నారాయణ

ఘర్షణ శ్రీనివాస్‌, సంపూర్ణేశ్ బాబు, శశాంక్, సమీర్, సుడిగాలి సుధీర్, బొప్పన విష్ణు, కౌశిక్ ఉన్నారు.

ఈసీ సభ్యులకు పోలైన ఓట్లు

* శివారెడ్డి (362 ఓట్లు)

* గీతా సింగ్‌ (342 ఓట్లు)

* అశోక్‌ కుమార్‌ (336 ఓట్లు)

* బ్రహ్మాజీ (334 ఓట్లు)

* శ్రీలక్ష్మీ (330 ఓట్లు)

* సి.మాణిక్‌ (326 ఓట్లు)

* ప్రభాకర్‌ (319 ఓట్లు)

* తనీష్‌ (306 ఓట్లు)

* శ్రీనివాసులు (296 ఓట్లు)

* హరనాథ్‌బాబు (296 ఓట్లు)

* సురేశ్‌ కొండేటి (294 ఓట్లు)

* ఎన్‌.శివన్నారాయణ (290 ఓట్లు)

* సంపూర్ణేశ్‌బాబు (285 ఓట్లు)

* శశాంక్‌ (284 ఓట్లు)

* సమీర్‌ (282 ఓట్లు)

* సుడిగాలి సుధీర్‌ (279 ఓట్లు)

* బొప్పన విష్ణు (271 ఓట్లు)

* కౌశిక్‌ (269 ఓట్లు)

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.