LIVE : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డితో ఈటీవీ భారత్ ప్రత్యేక ఇంటర్వ్యూ - ప్రత్యక్ష ప్రసారం
Telangana BJP President Kishan Reddy Interview : ఉచితాల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలకు కావాల్సింది ఉచితాలు కాదని విద్యా, వైద్యం ఆర్థిక స్వాలంభనకావాలన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం, ఉద్యోగ కల్పన చేపడుతామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కావన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాణానికి బొమ్మ, బొరుసులాంటివి అన్నారు. కాంగ్రెస్తో బీఆర్ఎస్ అధికారం పంచుకున్న చరిత్ర ఉందన్నారు. దీపావళి తరువాత తమ ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తామని తెలిపారు. జాతీయ నేతలతో ప్రచారం కూడా సాగిస్తామని.. మరో మూడు సభల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఆర్థిక సంక్షోభం నుంచి తెలంగాణను గట్టెక్కించడం ఒక్క బీజేపీతోనే సాధ్యమని.. రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఒక్కసారి తమకు అవకాశం ఇవ్వాలంటున్న కిషన్ రెడ్డితో ఈటీవీ, ఈటీవీ భారత్ ముఖాముఖి..