LIVE : సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో మంత్రి కేటీఆర్ రోడ్ షో - ప్రత్యక్షప్రసారం
Minister KTR Live : రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ను మూడోసారి గెలిపించడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్(Minister KTR) సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందు నుంచే అనేక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సభలు నిర్వహించి.. అందులో పాల్గొన్నారు. కేసీఆర్ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేయడమే తన లక్ష్యంగా కేటీఆర్ ముందుకు సాగుతున్నారు. కరెంటు కావాలా? కాంగ్రెస్ కావాలా? అనే నినాదంతో ప్రజల ముందుకు కేటీఆర్ వెళుతున్నారు.
అలాగే ఒకవైపు సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలతో ప్రజల ముందుకు వెళ్లగా.. హరీశ్రావు ఆత్మీయ సభలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. అలాగే మంత్రి కేటీఆర్ సైతం నియోజకవర్గాల్లో జరుగుతున్న బీఆర్ఎస్ సభలకు వెళుతూ.. రోడ్ షోలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ దుబ్బాక నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాసేపటి క్రితం హైదరాబాద్ చేరుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. అనంతరం సనత్నగర్ నియోజకవర్గంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు.