LIVE : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంటర్వ్యూ - ప్రత్యక్ష ప్రసారం
Published: Nov 18, 2023, 10:02 AM

CLP leader Bhatti Vikramarka Interview : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం రాబోతోందని... సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆశా భావం వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్ గ్రాఫ్ మరింత పెరుగుతుందని.. ఈ సారి 74 నుంచి 78 స్థానాలతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. రాష్ట్రంలో ప్రజా పాలన అందించడం ఖాయమని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలతోపాటు పార్టీ మేనిఫెస్టో ను ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. ఉచిత విద్యుత్తు పేటెంట్ ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని.. కాంగ్రెస్ తెచ్చిన విద్యుత్తు ప్రాజెక్టులతోనే భారాస సర్కారు కరెంటు అందిస్తుందన్నారు. భారాస లో నియంతలా కేసీఆర్ ఒక్కరే ఉన్నారని.. కాంగ్రెస్ లో మాత్రం సీఎం పదవికి అర్హులైన నాయకులు చాలామంది ఉన్నారన్నారు. రాబోయేది ఇందిరమ్మ రాజ్యమేనని.. అధికారంలోకి వచ్చాక ప్రజా పాలన అందిస్తామంటున్న మల్లు భట్టి విక్రమార్కతో ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం.