LIVE : రూ.2 వేల నోట్ల జారీపై ఆర్బీఐ కీలక ఉత్తర్వులు
Published: May 19, 2023, 7:09 PM

2000 Rupees note withdrawn by RBI : రూ.2వేల నోట్ల జారీపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆర్బీఐ పేర్కొంది. రూ.2వేల నోట్ల నోట్లను చలామణి నుంచి ఆర్బీఐ ఉపసంహరించుకోనుంది. రూ.2వేల నోట్లు ఉన్నవారు ఈనెల 23 నుంచి సెప్టెంబరు 30లోగా మర్చుకోవాలని ఆర్బీఐ వినియోగదారులకు సూచించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే రూ.2వేల నోట్ల ముద్రణ నిలిపివేశామని ఆఆర్బీఐ స్పష్టం చేసింది. దేశంలోని 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2వేల నోట్లు మార్చుకునే సౌలభ్యం కల్పిస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఒక విడతలో రూ.20వేల చొప్పున మాత్రమే మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించారు. డిపాజిట్ విషయంలో ఎలాంటి నిబంధనలు విధించలేదు. ఆర్బీఐ 2016 నవంబరులో రూ.2 వేల నోట్లు ప్రవేశపెట్టింది.