ETV Bharat / jagte-raho

పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని వృద్ధుడు మృతి

పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని వృద్ధుడు మృతి చెందిన విషాద ఘటన యాకత్​పురా రైల్వేస్టేషన్​లో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

old man died in train accident at yakatpura railway station in hyderabad
పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని వృద్ధుడు మృతి

Published : November 12, 2020 at 10:43 PM IST

Choose ETV Bharat

కాచిగూడ రైల్వే డివిజన్ పరిధిలోని యాకత్​పురా రైల్వేస్టేషన్​లో మహమ్మద్ అబ్దుల్ కరీం అనే 65 ఏళ్ల వృద్ధుడు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృత్యువాత పడ్డాడు. యాకత్​పురాలోని అజ్మత్​నగర్​కు చెందిన మహమ్మద్ అబ్దుల్ కరీం ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తుండేవాడు.

గురువారం ఉదయం 9 గంటల సమయంలో యాకుత్​పురా రైల్వే స్టేషన్​లో తన ఇంటికి వెళ్లేందుకు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు కాచిగూడ రైల్వే పోలీసు అధికారి లాల్య నాయక్ తెలిపారు.