ETV Bharat / jagte-raho

దా'రుణ' యాప్​ కేసులో దర్యాప్తు ముమ్మరం... రూ.320 కోట్లు సీజ్

లోన్‌యాప్‌ల కేసులో హైదరాబాద్​ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు 20 మందిని అరెస్ట్ చేశామని సీపీ అంజనీకుమార్​ తెలిపారు. రూ.320 కోట్లు నిలుపుదల చేశామని సీపీ వెల్లడించారు.

hyderabad cp anjani kumar on loan apps case investigation
hyderabad cp anjani kumar on loan apps case investigation

Published : February 10, 2021 at 5:36 PM IST

Choose ETV Bharat

లోన్‌యాప్స్‌ కేసులో ఇప్పటి వరకు 20 మందిని అరెస్ట్‌ చేసినట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు. గుడ్‌గావ్‌, బెంగళూరు సహా 9 రాష్ట్రాల్లో కేసు దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఇప్పటివరకు 320 కోట్ల రూపాయలు ఖాతాలు నిలుపుదల చేశామన్నారు.

గేమింగ్‌ ఫ్రాడ్‌లో హాంకాంగ్‌ చైనా అకౌంట్లకు రూ.105 కోట్లు బదిలీ జరిగినట్లు గుర్తించామని సీపీ అంజనీకుమార్​ తెలిపారు. దర్యాప్తు వేగంగా జరుగుతోందని.. వీలైనంత వరకు అందరు నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

దా'రుణ' యాప్​ కేసులో ముమ్మర దర్యాప్తు... 320 కోట్ల ఖాతాలు నిలిపివేత

ఇదీ చూడండి: బైక్​ను తప్పించబోయి కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు జలసమాధి